వైద్యం వికటించి మూడు నెలల బాలుడు మృతి.. బాపట్ల జిల్లాలో దారుణం; బంధువుల ఆందోళన!!
వైద్యో నారాయణో హరి అంటారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించి విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోయేలా చేస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా రేపల్లె పట్టణంలో ఓ మూడు నెలల బాలుడు ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఇక ఈ దారుణ ఘటన వివరాల్లోకి వెళితే
అనారోగ్యంతో ఆస్పత్రిలో మూడునెలల బాబు.. వైద్యుల నిర్లక్ష్యంతో మృతి
భట్టిప్రోలుకు చెందిన మౌనిక అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్న తన మూడు నెలల కుమారుడిని శనివారం రాత్రి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించింది. చిన్నారిని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్య సిబ్బంది తమ పర్యవేక్షణలోనే బాలుడిని ఉంచుకున్నారు. వైద్యులు బాబును పరీక్షించలేదు. వైద్యం చెయ్యలేదు. నర్సులు అనారోగ్యం బారిన పడిన బాలుడికి వైద్యం చేశారు. ఆ తర్వాత సోమవారం సాయంత్రం మూడు గంటల సమయంలో బాలుడి ఆరోగ్యం బాగానే ఉంది అని చెప్పిన సిబ్బంది, 5 గంటల సమయంలో బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులకు తెలిపారు.

ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళన.. నర్సుల వైద్యమే కారణమని ఆగ్రహం
ఆరోగ్యంగా ఉంటాడు అనుకున్న కొడుకు చనిపోవడంతో తల్లి మౌనిక స్పృహ కోల్పోయింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే పసి బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సులు చికిత్స చేయడం వల్ల బాలుడు మృతి చెందాడని ఆరోపించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. సదరు ప్రైవేట్ ఆస్పత్రి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పసివాడి ప్రాణం కాపాడతారని ఆసుపత్రికి వస్తే, వచ్చీరాని వైద్యంతో నర్సులు పసివాడి ప్రాణానికే ముప్పు తెచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఆస్పత్రి యాజమాన్యం, బాధ్యలపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబం విజ్ఞప్తి
ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్యులు వైద్యం విషయంలో నిర్లక్ష్యం వద్దని పదేపదే చెప్తున్నా వైద్యుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాల పాలిట యమపాశంలా మారింది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రిగా పని చేస్తున్న విడదల రజిని ఈ తరహా నిర్లక్ష్యం సహించేది లేదని చెప్పి, ఇప్పటికే అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు. అయినా ఏపీలో మాత్రం అనేక ఆస్పత్రులలో పరిస్థితి ఏ మాత్రం మారలేదు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications