వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయా?: చంద్రబాబుకు ట్రైనీ ఐఏఎస్‌ ప్రశ్న

|
Google Oneindia TeluguNews

ముస్సోరి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును తన ప్రశ్నతో సందిగ్ధంలో పడేశారు ఓ యువ ట్రైనీ ఐఏఎస్. మంగళవారం చంద్రబాబునాయుడు ముస్సోరిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ అకాడమీలో యువ ట్రైనీ ఐఏఎస్‌లను ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే.

ప్రసంగం అనంతరం చంద్రబాబునాయుడు ట్రైనీ ఐఏఎస్‌లతో కొంత సరదాగా గడిపారు. ఈ సమయంలో పలువురు ఐఏఎస్‌లు అడిగి ప్రశ్నలుకు తీరిక సమాధానం చెప్పారు చంద్రబాబు. కాగా, ఓ ఐఏఎస్ మాత్రం చంద్రబాబును సందిగ్ధంలో పడేసే ప్రశ్న వేశారు.

A trainee IAS questioned Chandrababu on AP and Telangana

‘సార్, భవిష్యత్తులో విడిపోయిన తెలుగు రాష్ట్రాలు మళ్లీ కలుస్తాయని భావిస్తున్నారా?' అని ఓ ట్రైనీ ఐఏఎస్ ప్రశ్నించారు. దీంతో అక్కడ కొంతసేపు నవ్వులు పూశాయి. అయితే సమాధానం చెప్పాలో తెలియక చంద్రబాబు కొంత తటపటాయించారు.

ఆ తర్వాత సర్దుకుని ‘విభజన గతించిన చరిత్ర. ఇక మీదట రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకుంటున్నా' అని చంద్రబాబునాయుడు వారికి సమాధానమిచ్చారు.

English summary
A trainee IAS has questioned Andhra Pradesh CM Chandrababu Naidu on AP and Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X