పచ్చడి పెడుతూ సీతారామన్, వీడియో వైరల్: మోడీ మరో ఆలోచన
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మినహా ఇంతవరకు ఎవరూ పర్యవేక్షించని రక్షణ శాఖ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ.. నిర్మలా సీతారామన్కు అప్పగించారు.
అమరావతి/హైదరాబాద్: మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మినహా ఇంతవరకు ఎవరూ పర్యవేక్షించని రక్షణ శాఖ బాధ్యతలను ప్రధాని నరేంద్ర మోడీ.. నిర్మలా సీతారామన్కు అప్పగించారు.
ఏ మంత్రికి ఏ శాఖ?: నిర్మల సీతారామన్కు కీలకమైన రక్షణ, అశోక్-సుజనలకు పాతవే
నిర్మలా సీతారామన్ వీడియో హల్చల్
నిర్మలా సీతారామన్ రక్షణ శాఖ మంత్రి అయిన తర్వాత నాటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న ఆమె, తమ ఇంటి వ్యవహారాల్లో, ముఖ్యంగా పచ్చళ్లు పెట్టడం వంటి విషయాల్లో ఆమె ఆసక్తి కనబరిచేవారు.
నిర్మల ఆవకాయ పచ్చడి పెడుతున్న వీడియో
ఈ విషయాన్ని తెలియజేస్తున్న ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. సుమారు నాలుగేళ్ల కిందటి ఈ వీడియోలో నిర్మలా సీతారామన్ తన తల్లితో కలిసి ఆవకాయ పచ్చడి పెడుతున్నారు.
మోడీ నిర్ణయంతో ఆశ్చర్యం
నిర్మలా సీతారామన్ పైన ప్రధాని మోడీ పెద్ద బరువే పెట్టారు. ఓ జూనియర్ కేంద్రమంత్రికి, ఇప్పటి వరకు కేంద్ర సహాయమంత్రిగా ఉన్న ఆమెకు ఏకంగా రక్షణ శాఖను ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. మోడీ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేసింది.
నిర్మల అర్థం చేసుకునే వరకు ఆర్నెళ్లు పడుతుందని
రక్షణ శాఖ బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ దానిని అర్థం చేసుకునే వరకే ఆరు నెలలు పడుతుందని కొందరు వ్యాఖ్యానించారని తెలుస్తోంది. నిర్మలపై చాలా పెద్దబరువు వేశారని అంటున్నారు. అయితే ఆమె దక్షత చూసిన తర్వాతే మోడీ ఇంత కీలకమైన బాధ్యతలు అప్పగించారని అంటున్నారు.
ఇది మోడీ మరో ఆలోచనా?
సీనియర్లకు రక్షణ శాఖను అప్పగిస్తే తన మాట ఎక్కువగా చెల్లుబాటు కాదని, అందుకే నిర్మలకు ఇచ్చి ఉంటారని కొందరు అంటున్నారు. నిర్మలకు ఇవ్వడం ద్వారా రక్షణ శాఖకు సంబంధించిన కీలక నిర్ణయాలలో తన పాత్ర కూడా పోషించవచ్చునని భావించారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అందుకే మోడీ అప్పగించారు
అయితే, అదంతా వట్టిదేనని, నిర్మలా సీతారామన్ దక్షత చూసి ఇచ్చారని ఇంకొందరు చెబుతున్నారు. ఆమె నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. సీనియార్టీ, అనుభవం కాకుండా దక్షతను బట్టి, ఎన్నికల యాంగిల్లో పదవులు ఇచ్చారని అంటున్నారు.