Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ మంత్రుల కాన్వాయ్ లో ప్రమాదం ... సేఫ్ గా బయటపడ్డ మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్

ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి టోల్ ప్లాజా వద్ద ఏపీ మంత్రుల కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సోమవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ జిల్లాల్లో పర్యటించడానికి వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

మంత్రుల కాన్వాయ్ లో ఒకకారు సడన్ బ్రేక్ వేయటంతో దాని వెనుక ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి డీ కొన్నాయి. దీంతో ఆరు కార్ల ముందు భాగం ధ్వంసం అయ్యింది . నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం కృష్ణాపురం లో జరిగిన హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపన కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు . కాసేపట్లో సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.

Accident in convoy of AP ministers ... Mekapati Gautam Reddy and Anil Kumar Yadav safe

Recommended Video

    Andhra Pradesh : కొత్త జిల్లాల ఏర్పాటుకు వేగం పెంచిన ఏపీ ప్రభుత్వం.. ఊపందుకున్న పునర్విభజన ప్రక్రియ!

    460 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . మంత్రుల కాన్వాయ్ లోని వాహనాల ధ్వంసమైన ఘటన మినహాయించి, ఎవరికి ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఘటన జరిగిన తర్వాత కాసేపటికి మంత్రులు అక్కడినుంచి బయలుదేరి శంకుస్థాపనకు బయలుదేరి వెళ్ళారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+