ఏపీ మంత్రుల కాన్వాయ్ లో ప్రమాదం ... సేఫ్ గా బయటపడ్డ మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్
ఏపీ మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ లకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లి టోల్ ప్లాజా వద్ద ఏపీ మంత్రుల కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. సోమవారం నాడు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి , అనిల్ కుమార్ యాదవ్ జిల్లాల్లో పర్యటించడానికి వెళుతున్న క్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
మంత్రుల కాన్వాయ్ లో ఒకకారు సడన్ బ్రేక్ వేయటంతో దాని వెనుక ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి డీ కొన్నాయి. దీంతో ఆరు కార్ల ముందు భాగం ధ్వంసం అయ్యింది . నెల్లూరు నుంచి మర్రిపాడు మండలం కృష్ణాపురం లో జరిగిన హైలెవల్ కెనాల్ ఫేజ్ 2 శంకుస్థాపన కి వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో మంత్రులు ఊపిరిపీల్చుకున్నారు . కాసేపట్లో సోమశిల హై లెవెల్ కెనాల్ ఫేజ్-2 శంకుస్థాపన కార్యక్రమం సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు.

Recommended Video
460 కోట్ల వ్యయంతో ఫేజ్ 2 నిర్మాణ పనులకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . మంత్రుల కాన్వాయ్ లోని వాహనాల ధ్వంసమైన ఘటన మినహాయించి, ఎవరికి ఎలాంటి ఆపద వాటిల్లలేదు. ఘటన జరిగిన తర్వాత కాసేపటికి మంత్రులు అక్కడినుంచి బయలుదేరి శంకుస్థాపనకు బయలుదేరి వెళ్ళారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications