విద్రోహ కుట్ర: రాజమండ్రి తొక్కిసలాటపై అచ్చన్న, కాల్వలో పడిన దేవినేని
శ్రీకాకుళం/విజయవాడ: గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో తొలి రోజు జరిగిన ఘటన పైన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి రోజు జరిగిన తొక్కిసలాట వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని సమాచారం అందిందని అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్న కారణంగా అది చెడగొట్టేందుకు ఘటనకు ముందే విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందినట్లుగా ప్రచారం జరిగిందన్నారు.

అందువల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని న్యాయవిచారణ జరిపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4.12 కోట్ల మంది పుష్కర స్నానం ఆచరించారని చెప్పారు. చివరి రెండు రోజులు జనం పోటెత్తుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు.
కాలువలో జారిపడిన దేవినేని
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు గురువారం నాడు ప్రమాదం తప్పింది. ఆయన సాయంత్రం గన్నవరం మండలం చిక్కవరం వద్ద పోలవరం కుడి కాల్వ పనులు పరిశీలిస్తున్నారు. పనులపై అధికారులతో మాట్లాడుతుండగా ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అధికారులు, ఇతర సిబ్బంది ఆయనను బయటకు లాగారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications