విద్రోహ కుట్ర: రాజమండ్రి తొక్కిసలాటపై అచ్చన్న, కాల్వలో పడిన దేవినేని
శ్రీకాకుళం/విజయవాడ: గోదావరి పుష్కరాల్లో రాజమండ్రిలో తొలి రోజు జరిగిన ఘటన పైన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గురువారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలి రోజు జరిగిన తొక్కిసలాట వెనుక విద్రోహ శక్తుల ప్రమేయం ఉందని సమాచారం అందిందని అనుమానం వ్యక్తం చేశారు.
గురువారం సాయంత్రం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్న కారణంగా అది చెడగొట్టేందుకు ఘటనకు ముందే విద్యుత్ షాక్తో ఇద్దరు మృతి చెందినట్లుగా ప్రచారం జరిగిందన్నారు.

అందువల్లే ఈ ఘటన జరిగిందన్నారు. ఈ అంశాన్ని న్యాయవిచారణ జరిపిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 4.12 కోట్ల మంది పుష్కర స్నానం ఆచరించారని చెప్పారు. చివరి రెండు రోజులు జనం పోటెత్తుతారని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశామన్నారు.
కాలువలో జారిపడిన దేవినేని
ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు గురువారం నాడు ప్రమాదం తప్పింది. ఆయన సాయంత్రం గన్నవరం మండలం చిక్కవరం వద్ద పోలవరం కుడి కాల్వ పనులు పరిశీలిస్తున్నారు. పనులపై అధికారులతో మాట్లాడుతుండగా ఆయన ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అధికారులు, ఇతర సిబ్బంది ఆయనను బయటకు లాగారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications