తిరుమలలో అపచారం.. శ్రీవారి ఆలయంపై మళ్ళీ చక్కర్లు కొట్టిన విమానం!
కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండల పైన కొలువుతీరిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు మన దేశంలోనే నలుమూలల నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాడించిన తిరుమల శ్రీవారి ఆలయం విషయంలో ఏది జరిగినా అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎంతో ఖ్యాతి గడించిన తిరుమల శ్రీవారి ఆలయం పైన ఇటీవల విమానాలు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారుతుంది.
ఆలయం పైనుండి రాకపోకలు నిషిద్ధం
నేడు మరోమారు తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం చక్కర్లు కొట్టింది. ఇక ఈ ఘటన పైన భక్తులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయం పైనుంచి రాకపోకలు నిషిద్ధమని, అలా ఆలయం పైనుంచి రాకపోగలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డుకు సూచించారు.

కేంద్రానికి టీటీడీ ఫిర్యాదు.. కానీ పట్టింపేది
ఇక ఇదే విషయంపైన టిటిడి పలుమార్లు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆలయం పైన నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమాన రాకపోకలను నిషేధించాలని టిటిడి కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అయితే టీటీడీ ఎన్నిసార్లు ఈ వ్యవహారం పైన కేంద్రానికి ఫిర్యాదు చేసిన కేంద్ర విమానా శాఖ పట్టించుకోకుండా అలసత్వం వహిస్తూనే ఉంది.
నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్
అయితే ఈ వ్యవహారంలో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా కేంద్రం వ్యవహరిస్తుందని భక్తుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా తిరుమల శ్రీవారి ఆలయంపైన నో ఫ్లై జోన్ గా ప్రకటించి, శ్రీవారి ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా కాపాడాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.
కేంద్రం స్పందిస్తుందా?
మరి కేంద్ర పౌర, విమాన యాన శాఖా మంత్రిగా ఉన్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కింజారపు రామ్మోహన్ నాయుడు అయినా ఈ ఘటన పైన పట్టించుకుంటారా? తిరుమల పవిత్రత కాపాడేలా చూస్తారా? మరి ఈ వ్యవహారంలో ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందా? తిరుమల శ్రీవారి ఆలయ గోపురం పైన విమానాలు చక్కర్లు కొట్టడం ఆగుతుందా? అనేది తెలియాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications