ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు వివస్త్రను చేసి బ్లేడుతో కోశాడు
విశాఖపట్టణం:;ప్రేమించి పెళ్ళి చేసుకొన్నాడు.కొంతకాలం భార్యను బాగానే చూసుకొన్నాడు. కాని, ఈ మద్య వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ వేదింపులు మరీ తీవ్రమయ్యాయి. పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించినా వేధింపులు తప్పలేదు. పైగా వివస్త్రను చేసి భార్యపై బ్లేడులతో శరీరంపై గాట్లు పెట్టిన ఉన్మాదిఉదంతమిది.
ప్రేమించి పెళ్ళిచేసుకొన్నాడు. నేరచరిత్ర కలిగిన వ్యక్తి అని తెలిసి కూడ ఆమె అతణ్ణి పెళ్ళిచేసుకొంది. అకారణంగా భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ వేధింపులు ఇటీవల తీవ్రమయ్యాయి. అవి ఏ స్థాయిలో ఉన్నాయంటే భార్యను వివస్త్రను చేసి మరీ బ్లేడుతో గాయపర్చాడు.
విశాఖపట్టణంలోని గోపాలపట్నంలోని నేతాజీ వీధిలో రిక్క వీరబాబు నివసిస్తున్నాడు. ఆయన సునీతను పదేళ్ళ క్రితం ప్రేమించి వివాహం చేసుకొన్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు. రైళ్ళలో కాఫీలు, టీ లు విక్రయిస్తూ జీవనం సాగించేవాడు వీరబాబు. అయితే ఇటీవల బార్యను వేదింపులకు గురిచేస్తున్నాడు.
పది రోజుల క్రితం భార్య సునీతను వీరబాబు తీవ్రంగా కొట్టాడు.అంతేకాదు చంపుతానని బెదిరించాడు. ఈ భాద తట్టుకోలేక ఆమె పోలీసులను ఆశ్రయించింది. గోపాలపట్నం పోలీసులు భార్యభర్తలకు కౌన్సిలింగ్ నిర్వహించారు.
పోలీసు కౌన్సిలింగ్ తో తన భార్యను సకర్రమగా చూసుకొంటానని వీరబాబు హామీ ఇచ్చాడు.వారిని ఇంటికి పంపారు పోలీసులు. అయితే ఇంటికి వెళ్ళగానే వీరబాబు తన ప్రతాపం చూపాడు.భార్యను వివస్త్రను చేసి చితకబాదాడు.అంతేకాదు బ్లేడుతో భార్య వీపుపై గాయపర్చాడు. అడ్డుకొన్న పెద్ద కుమార్తెను కూడ గాయపర్చాడు. స్థానికులు అడ్డుకోవడంతో వారిని కూడ బెదిరించాడు. భార్యను చిత్రహింసలు పెట్టి పారిపోయాడు.భాదితులు విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.