కూలీ దంపతులను ముంచిన అగ్రిగోల్డ్: నదిలో దూకి ఆత్మహత్య
విజయవాడ: కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అగ్రిగోల్డ్ బాధిత జంట ఆత్మహత్య చేసుకుంది. విజయవాడ భవానీపురంలో నివాసం ఉంటున్న ఓ వృద్ధ దంపతులు అగ్రిగోల్డ్ బాధితులు. వారు కూలీ పని చేసుకొని బతుకుతుంటారు.
భవిష్యత్తు కోసం అగ్రిగోల్డ్ను నమ్ముకున్నారు. అయితే, అది పూర్తిగా ముంచడంతో.. ఏం చేయాలో తెలియక కృష్ణా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
గుంతకుల్లులో ఆత్మహత్యాయత్నం
గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పెన్షన్లు, ఇంటి పట్టాలు రద్దు చేశారనే కారణంతో మనస్తాపం చెందిన వారు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

భూ సేకరణకు వ్యతిరేకంగా ధర్నా
రాజధాని నిర్మాణ గ్రామాల్లో బలవంతపు భూసేకరణ వ్యతిరేకిస్తూ గ్రామ కంఠాలను విస్తరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం మంగళగిరి మండలం నిడమర్రు, నవులూరు గ్రామాల్లోని సీఆర్డీఏ కార్యాలయాల ఎదుట వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు ఆధ్వర్యాన రైతులు ధర్నా నిర్వహించారు.
వైసిపి, కాంగ్రెస్, సిపిఎం.. తదితర పార్టీల ఆధ్వర్యంలో నిడమర్రు సిఆర్డిఏ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కొలనుకొండ శివాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మల్లాది విష్ణు మాట్లాడుతూ... సింగపూర్ కంపెనీలకు ధారాదత్తం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపూరితంగా బహుళ పంటలు పండే భూములను తీసుకుని రైతులకు, రైతుకూలీలకు అన్యాయం చేస్తున్నారన్నారు. స్వచ్చందంగా భూములిచ్చే వారినుంచి తీసుకోవచ్చని, ఇష్టంలేని రైతుల నుంచి సేకరణ చేయవద్దన్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications