ఎయిర్ హోస్టెస్ మృతి: భర్తపై అనుమానం, ఆర్థికంగా బాగుందని చెప్పి!
హైదరాబాద్: మాజీ ఎయిర్ హోస్టెస్ రీతును ఆమె భర్తనే హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు సోమవారం నాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ కలహాలే కారణం కావొచ్చునని పలువురు అనుమానిస్తున్నారు. ఆమె తలకు బలమైన గాయం అయినట్లుగా తెలుస్తోంది.

పోస్టుమార్టం తర్వాత వివరాలు తెలుస్తాయి
రీమా రాత్రి చనిపోయి పడి ఉందని, రాత్రి పూట ఆసుపత్రికి తీసుకు వెళ్లామని మృతురాలి తండ్రి ఫిర్యాదు చేశారని పోలీసులు చెప్పారు. రీతుది జంషెడ్ పూర్ అని, భర్తది పంజాబ్ అని చెప్పారు.
పెళ్లి అనంతరం హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారని చెప్పారు. ఈ సంఘటనలో ఉరేసుకున్న ఆనవాళ్లు లేవని చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్థు చేస్తున్నామని చెప్పారు. పోస్టుమార్టం అనంతరం వివరాలు తెలుస్తాయని చెప్పారు.
ఆర్థికంగా బాగున్నానని చెప్పి...!
రీతు కొద్ది రోజుల క్రితం వరకు ఎయిర్ హోస్టెస్గా పని చేశారు. రీతు, భర్త సచిన్లు ప్రేమించుకున్నారు. హైదరాబాద్కు వచ్చి పెళ్లి చేసుకున్నారు. అనంతరం రీతూ ఉద్యోగం మానేశారు.
అయితే, పెళ్లికి ముందు తనకు వ్యాపారాలు ఉన్నాయని, ఆర్థికంగా బాగా నిలదొక్కుకున్నానని చెప్పి అతను రీమాను నమ్మించి పెళ్లి చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ, తీరా హైదరాబాద్ వచ్చాక అసలు అతని వద్ద ఏమీ లేవని తెలిసినట్లుగా సమాచారం. దీనిపై వాగ్వాదం జరిగేదని తెలుస్తోంది.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications