వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హైదరాబాద్ సిటీ బస్సుల్లో ఫ్రీ వైఫై: నేటి నుంచి అందుబాటులోకి..
హైదరాబాద్ : నగరంలోని ఆర్టీసీ బస్సుల్లో నేటి నుంచి ఫ్రీ వైఫై సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్ టెల్ ఈ ఉచిత వైఫైని అందజేస్తోంది. టీఎస్ఆర్టీసీ-భారతి ఎయిర్ టెల్ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు నేటి నుంచి సిటీ బస్సుల్లో ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
నగరంలో ఎక్కువ రద్దీగా ఉండే మార్గాల్లో ప్రయాణించే 115 మెట్రో లగ్జరీ బస్సుల్లో ప్రయోగాత్మకంగా 6 నెలల పాటు ఫ్రీ వైఫై సర్వీసును అందించనున్నారు. ఫ్రీ వైఫై ద్వారా బస్సులో ప్రయాణించేవారు ఎవరైనా సరే.. రోజుకు 20నిమిషాల పాటు ఉచిత వైఫై సేవలను వినియోగించుకోవచ్చు.
ఈ ఉచిత వైఫై సేవలను ఎయిర్ టెల్ అందిస్తున్నప్పటికీ.. ఇతర టెలికాం వినియోగదారులు కూడా ఈ సేవలు ఉపయోగించుకోవచ్చు.
English summary
Telangana State Road Transport Corporation (TSRTC) has partnered with Airtel to provide free Wi-Fi on Metro Luxury Buses in Hyderabad. 115 Luxury AC buses have been equipped with free public Wi-Fi hotspots.
Story first published: Wednesday, November 23, 2016, 15:32 [IST]