వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయాల్లోకి నో, అందుకే పుస్తకం, పదవిలో ఉన్నప్పుడు ఎందుకు చెప్పలేదంటే: అజేయ కళ్ళం

By Srinivas
|
Google Oneindia TeluguNews

అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎస్ అజేయ కళ్లం 'మేలు కొలుపు' పుస్తకావిష్కరణ బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ, ప్రాంతీయ పార్టీలు ఇలా అన్ని పార్టీలలోను రాచరిక వ్యవస్థ ఉందన్నారు. అన్ని పార్టీలు ఇలాగే ఉన్నాయన్నారు.

ప్రజాస్వామ్యం దశలవారీగా క్షీణిస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. యువతను చైతన్యం చేసేందుకే తాను మేలు కొలుపు పుస్తకం రాశానని చెప్పారు. వ్యవస్థలోని లోపాలను అందరికీ చెప్పాలనే ఈ పుస్తకం తీసుకు వచ్చినట్లు తెలిపారు.

Ajeya Kallam Melu Kolupu book released

రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి తనకు లేదని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయన్నారు.

పదవిలో ఉన్నప్పుడు ఇవి అన్నీ ఎందుకు చెప్పలేదని కొందరు అడుగుతున్నారని, కానీ పదవిలో ఉన్నప్పుడు ఇలాంటివి మాట్లాడవద్దనే ఊరుకున్నానని చెప్పారు. జస్టిస్ లక్ష్మణ రెడ్డి మాట్లాడుతూ.. సమాజాన్ని అవినీతి పట్టిపీడిస్తోందన్నారు. రక్షణ ఇవ్వాల్సిన వాళ్లే అవినీతికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు, ఉన్నతాధికారులే అవినీతికి పాల్పడితే ఎవరికి చెప్పుకోవాలన్నారు.

English summary
Andhra Pradesh government former chief Secretary Ajeya Kallam Melu Kolupu book released on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X