జయలలిత పాడిన తొలి తెలుగు పాట ఇదే
హైదరాబాద్/చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో తిరుగులేని నాయకురాలు అయిన జయలలిత అంతకు ముందు సినీ రంగంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనం నుంచి భరతనాట్యంలో ప్రావీణ్యం పోందిన జయలలితలో మంచి నటి ఉన్నారు.
అంతే కాకుండా ఆమె మంచి సింగర్ అనే విషయం చాలమందికి తెలీదు. సినీ జగత్తులో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జయలలిత తమిళ, తెలుగు సినిమాల్లో చాలా పాటలు పాడి తన ప్రతిభ చాటుకున్నారు.

జయలలిత బహుముఖ ప్రజ్ఞాశాలి అని చెప్పడానికి చాల ఉదాహరణలు ఉన్నాయి. అందులో నందమూరి తారకరామారావు (సీనియర్ ఎన్టీఆర్) నటించిన ఆలీబాబా 40 దొంగలు సినిమాలో జయలలిత కథానాయికి. ఆ సినిమాలో జయలలిత మొదటి సారి తెలుగులో పాట పాడారు..
అప్పట్లో ఆలీబాబా 40 దొంగులు సినిమా బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఎన్టీఆర్, జయలలిత జంటగా నటించిన ఈ సినిమాకు దర్శక మాంత్రికుడు బి. విఠలాచార్య దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు గంటసాల సంగీతం అందించారు. అందులో 3 నిమిషాల 20 సెకన్లు ఉన్న 'చల్ల చల్లని వెన్నెలాయే అనే' మధుర గీతాన్ని జయలలిత స్వయంగా ఆలపించారు. ఆపాట మీరు వినండి.












Click it and Unblock the Notifications