మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మోసం - 420 కేసు పెట్టాలని రెండు పీఎస్ల్లో అమరావతి రైతుల ఫిర్యాదు..
ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు కోసం జరుగుతున్న ప్రయత్నాలపై ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా.. అమరావతి ప్రాంతంలో మాత్రం వైసీపీ ప్రజాప్రతినిధులకు చుక్కలు కనిపిస్తున్నాయి. గత డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రకటన తర్వాత దాదాపు ప్రజల్లో తిరగడం మానేసిన ఈ ప్రాంతానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధులపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.
దీంతో తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై స్ధానిక రైతులు టౌన్, రూరల్ పీఎస్ లలో ఫిర్యాదు చేశారు. రాజధాని అమరావతిలోనే ఉంటుందంటూ తమను నమ్మించి ఓట్లు వేయించుకుని ఇప్పుడు రాజధానిని ఏకపక్షంగా తరలిస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఫిర్యాదుతో ఆర్కేపై 420 కేసు పెట్టాలని పీఎస్ లలో ఫిర్యాదులు చేశారు.

Recommended Video
రాజధాని తరలింపుపై తమ ఆవేదన చెప్పుకునేందుకు ఎమ్మెల్యే ఆర్కే అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నారని రైతులు తమ ఫిర్యాదులో ఆరోపించారు. రాజధాని విషయంలో తమను నమ్మించి మోసం చేసిన ఆర్కేపై ఛీటింగ్ కేసు నమోదు చేయాలంటూ రైతులు చేసిన ఫిర్యాదుపై మంగళగిరి టౌన్, రూరల్ పోలీసులు ఉన్నతాధికారులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications