అమరావతి కేంద్రంగా మరో కీలక ఘట్టం..!!
అమరావతి కీలక ఘట్టాలకు కేంద్రంగా మారుతోంది. రాజధాని నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రెండో విడత భూ సమీకరణ ప్రారంభించిన ప్రభుత్వం... ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తోంది. రైతుల సమస్యల పైన ఏర్పాటైన త్రిసభ్య కమిటీ వారి ఫిర్యాదుల పరిష్కారానికి అధికారులకు దిశా నిర్దేశం చేస్తోంది. కాగా.. అమరావతి లో హైకోర్టు భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. ఇందులో ఒకేసారి 4 రాఫ్ట్ లలో కాంక్రీట్ పనులు ప్రారంభం అయ్యాయి.
అమరావతి నిర్మాణ పనులు కీలక దశకు చేరుకున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా హైకోర్టు భవన నిర్మాణ పనులు శరవేగంగా పుంజుకున్నాయి. హైకోర్టు నిర్మాణ ప్రాంగణం లో ఒకేసారి 4 రాఫ్ట్లలో కాంక్రీట్ పనులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పనులు ప్రారంభించారు. ఏకధాటిగా 15,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ (రాఫ్ట్) పనులను ప్రారంభించినట్లు మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం నిర్మాణంలో 65,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగిస్తుండగా, ఇప్పటికే 15,000 క్యూబిక్ మీటర్లు పూర్తయిందని వివరించారు. నేటితో మరో 15,000 క్యూబిక్ మీటర్ల పనులు వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ హైకోర్టు భవనాన్ని B+G+8 (బేస్మెంట్ + గ్రౌండ్ + 8 అంతస్తులు) విధానంలో, 50.4 మీటర్ల ఎత్తుతో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నామి వివరించారు. మొత్తం 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనంలో 52 కోర్టు హాళ్లు అందుబాటులోకి రానున్నాయి.

నిర్మాణాల పూర్తి చేయటం పై ఫోకస్
నిర్మాణంలో అత్యంత కీలకమైన 'రాఫ్ట్ ఫౌండేషన్' పనులు పూర్తయితే, మిగిలిన భవన నిర్మాణం చాలా వేగంగా కొలిక్కి వస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.రాజధానిలో కేవలం కార్యాల యాలే కాకుండా, పాలన సాగించే యంత్రాంగం కోసం నివాసాల నిర్మాణాన్ని కూడా ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకుందని మంత్రి వివరించారు. అమరావతిలో అధికారులు, ఉద్యోగుల కోసం మొత్తం 4,026 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. వీటిలో 3,500 ఇళ్లను ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యంగా IAS అధికారుల నివాస భవనాలు ఇప్పటికే దాదాపుగా పూర్తి కావచ్చాయని ఆయన పేర్కొన్నారు. అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో, నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేసారు.
-
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
14కు మార్కాపురం బస్సు ప్రమాద మృతులు.. ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు! -
అమరావతి ఇక నుంచి.. ఏపీ కేబినెట్ సంచలన తీర్మానం..!! -
ఈ ప్రాంతాల్లో వంట గ్యాస్ సరఫరా పై ప్రభుత్వం కీలక నిర్ణయం, ఇక నుంచి..!! -
మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఉద్యోగుల బకాయిల విడుదలపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు, డెడ్ లైన్..!!











Click it and Unblock the Notifications