త్వరలో టీడీపీ రద్దు .. చంద్రబాబు కంకణం .. ఎన్నికల బహిష్కరణ అందుకే : అంబటి సెటైర్లు
తెలుగుదేశం పార్టీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని తీసుకున్న నిర్ణయంపై, చంద్రబాబు చేసిన ప్రకటనపై వైసిపి నేతలు మండిపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి పుట్టగతులు లేకుండా పోయిందని, ఓటమి భయంతోనే చంద్రబాబు ఎన్నికలు బహిష్కరిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జ్యోతిని ఆర్పడం కోసం చంద్రబాబు కంకణం కట్టుకున్నారని ఆయన విమర్శించారు.

ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదంటూ చంద్రబాబును ఎద్దేవా
తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంబటి రాంబాబు ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తే తప్పేంటో చెప్పాలని, చంద్రబాబుకు ఎందుకంత భయం అంటూ ప్రశ్నించారు. ఓటమికి భయపడేవాడు రాజకీయ నాయకుడు కాదంటూ చంద్రబాబును ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ ఏకపక్షంగా ఎన్నికలు వాయిదా వేసినప్పుడు ఎందుకు అడగలేదని చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు ఏరోజు ఒంటరిగా అధికారంలోకి రాలేదని, ఏదో ఒక పార్టీ పొత్తుల తోనే చంద్రబాబు అధికారంలోకి వచ్చాడని అంబటి రాంబాబు గుర్తు చేశారు.

రేపు అసెంబ్లీ , పార్లమెంట్ కు కూడా టీడీపీకి అభ్యర్థులు దొరకరు
చంద్రబాబు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాసిన లేఖను చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో గెలిచామని సంబరాలు చేసుకున్న టిడిపి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు ఎన్నికలు మీకు అనుకూలంగా ఉంటాయని ఎన్నికలను బహిష్కరించలేదా అంటూ ప్రశ్నించారు. రేపు అసెంబ్లీ పార్లమెంటు కూడా అభ్యర్థులు దొరకరు అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ఎద్దేవా చేశారు.

చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో పార్టీని కూడా రద్దు చేస్తారు
చంద్రబాబు త్వరలో రాష్ట్రంలో పార్టీని కూడా రద్దు చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంబటి రాంబాబు. చంద్రబాబును పిరికివాడు అన్నారు. తిరుపతిలో కూడా పోటీ విరమించుకుంటారా అంటూ ప్రశ్నించారు ఎమ్మెల్యే అంబటి. వెన్నుపోటు ద్వారా రాజ్యాధికారం సాధించారు అని అంబటి రాంబాబు చంద్రబాబు పై విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఎన్నికలకు వెళ్లినా గెలిచే అవకాశం లేదని చంద్రబాబుకు తెలిసే ఈ బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

తండ్రీ కొడుకులు కలిసి టిడిపి బండిని ముంచే పరిస్థితి
చంద్రబాబుకి రాద్దాంతం తప్ప సిద్ధాంతం లేదన్నారు. తండ్రీ కొడుకులు కలిసి టిడిపి బండిని ముంచే పరిస్థితి తీసుకు వచ్చారని విమర్శించారు. చంద్రబాబుకు, లోకేష్ కు టిడిపిని బతికించే సత్తా లేదని తేల్చి చెప్పారు. లోకేష్ కు పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు అని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు ఆత్మ బంధువులు అంతా ఒకేలా మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!











Click it and Unblock the Notifications