Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కౌంటర్: 4 ఏళ్ళుగా సహయంపై అమిత్ షా సమాధానం, బాబుకు బిజెపి లెటర్?

అమరావతి:ఎన్డీఏ నుండి బయటకు వచ్చే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు లేఖ రాశారు అయితే ఆ లేఖకు బిజెపి సమాధానం ఇవ్వనుంది. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా గురువారం నాడు ఈ లేఖను విడుదల చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హమీలను అమలు చేయడంలో బిజెపి సక్రమంగా వ్యవహరించనందుకు నిరసనగా ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చింది. ఎన్డీఏ నుండి బయటకు వచ్చిన వెంటనే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మాన నోటీసును కూడ ఇచ్చింది.

కొంత కాలంగా టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. చివరకు ఎన్డీఏ నుండి టిడిపి వెలుపలకు వచ్చింది. ప్రత్యేక హోదా అంశాన్ని లక్ష్యంగా చేసుకొని పోరాటం చేస్తోంది.

 బాబుకు అమిత్ షా కౌంటర్

బాబుకు అమిత్ షా కౌంటర్

ఏపీ రాష్ట్రానికి కేంద్రం నుండి ఏ మేరకు నిధులిచ్చామనే విషయమై బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కౌంటర్ ఇవ్వనున్నారు. ఎన్డీఏ నుండి బయటకు వెళ్ళేందుకు గల కారణాలను బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాసిన లేఖలో బాబు ప్రస్తావించారు. అయితే బాబు రాసిన లేఖకు అమిత్ షా కౌంటర్ లేఖను సిద్దం చేశారని సమాచారం. అమిత్ షా ఈ లేఖను గురువారం నాడు విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

 భవిష్యత్‌లో చేసే సహయం కూడ ప్రస్తావించనున్నారు

భవిష్యత్‌లో చేసే సహయం కూడ ప్రస్తావించనున్నారు

ఇప్పటివరకు ఏపీ రాష్ట్రానికి చేసిన సహయంతో పాటు రానున్న రోజుల్లో ఏపీ రాష్ట్రానికి చేయాల్సిన సహయానికి సంబంధించిన విషయాలపై తన లేఖలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రస్తావించే అవకాశాలున్నాయి.

 ఎన్నికల కోసమే అవిశ్వాసం

ఎన్నికల కోసమే అవిశ్వాసం

ఎన్నికల కోసమే కేంద్రంపై టిడిపి అవిశ్వాస తీర్మానం పెట్టిందని ఏపీ బిజెపి అధ్యక్షుడు, విశాఖ ఎంపీ హరిబాబు చెప్పారు. లోక్‌సభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తే ఏపీ రాష్ట్రానికి ఏం చేశామనే విషయాన్ని చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని హరిబాబు చెప్పారు.

 సభపైనే అవిశ్వాసం ఆధారపడి ఉంటుంది

సభపైనే అవిశ్వాసం ఆధారపడి ఉంటుంది

అవిశ్వాసం చర్చకు వస్తే తమకు కూడ ప్రయోజనమని ఏపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు చెప్పారు.టిడిపి తమపై చేస్తున్న ఆరోపణలకు తాము సమాధానం చెప్పే వీలు చిక్కుతోందని హరిబాబు చెప్పారు. అయితే అవిశ్వాసం సభలో చర్చకు వస్తోందా, రాదా అనే విషయమై సభ జరిగే తీరుపై ఆధారపడి ఉంటుందని ఆయన చెప్పారు.ఎన్నికల్లో గెలుపు కోసం వైసీపీ, టిడిపిలు వ్యూహరచనలో భాగంగానే ఈ అంశాన్ని తీసుకొన్నాయని హరిబాబు ఆరోపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+