Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో అమృత్ భారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు..! ఎప్పటి నుంచో తెలుసా ?

దక్షిణ రైల్వే పరిధిలో తాజాగా రాకపోకలు ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express)ల టైమింగ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ తాజాగా ప్రారంభించిన మూడు అమృత్ భారత్ రైళ్లతో పాటు మరో అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లోనూ కొన్ని స్టేషన్లలో సమయాల్లో మార్పులు చేస్తూ దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ మార్పులు ఏయే రైలుకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా వెల్లడించింది.

నాలుగు అమృత్ భారత్ ల సమయాల్లో మార్పు

దక్షిణ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన స్టేషన్లలో నాలుగు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్ని సవరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్, రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు సవరించిన సమయాలను గమనించాలని అధికారులు కోరారు.

Amrit Bharat Express Users Alert Southern Railway Announces New Timings at Select Stations

ఏపీలోని ఈ స్టేషన్లలో టైమింగ్స్ మార్పు

రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కు ఏపీలోని శ్రీకాకుళం రోడ్ నుంచి నెల్లూరు స్టేషన్ వరకూ స్పల్పమార్పులు జరిగాయి. గమ్యస్దానమైన తాంబరానికి మాత్రం ఈ రైలు 10 నిమిషాల ముందే అంటే ఉదయం 9.05కు చేరుకోనుంది. ఈ మార్పులు ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ కు ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి.

Amrit Bharat Express Users Alert Southern Railway Announces New Timings at Select Stations

మార్పులు స్వల్పమే

అలాగే రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు కూడా ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వస్తాయి. చివరిగా రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలుకు కేవలం తాంబరం స్టేషన్లో మాత్రమే సమయాన్ని స్వల్పంగా మార్చారు. ఈ మార్పులను దక్షిణ రైల్వే ఎక్స్ లో ట్వీట్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+