ఏపీలో అమృత్ భారత్ రైళ్ల టైమింగ్స్ లో మార్పులు..! ఎప్పటి నుంచో తెలుసా ?
దక్షిణ రైల్వే పరిధిలో తాజాగా రాకపోకలు ప్రారంభించిన అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ (Amrit Bharat Express)ల టైమింగ్స్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధాని మోడీ తాజాగా ప్రారంభించిన మూడు అమృత్ భారత్ రైళ్లతో పాటు మరో అమృత్ భారత్ రైలు టైమింగ్స్ లోనూ కొన్ని స్టేషన్లలో సమయాల్లో మార్పులు చేస్తూ దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అలాగే ఈ మార్పులు ఏయే రైలుకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయో కూడా వెల్లడించింది.
నాలుగు అమృత్ భారత్ ల సమయాల్లో మార్పు
దక్షిణ రైల్వే పరిధిలో ఎంపిక చేసిన స్టేషన్లలో నాలుగు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాల్ని సవరించినట్లు అధికారులు ప్రకటించారు. ఇందులో రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్, రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్, రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్, రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ ఉన్నాయి. ఆయా రైళ్లలో ప్రయాణించే వారు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకునేటప్పుడు సవరించిన సమయాలను గమనించాలని అధికారులు కోరారు.

ఏపీలోని ఈ స్టేషన్లలో టైమింగ్స్ మార్పు
రైలు నం.16108 సంత్రగచ్చి -తాంబరం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ కు ఏపీలోని శ్రీకాకుళం రోడ్ నుంచి నెల్లూరు స్టేషన్ వరకూ స్పల్పమార్పులు జరిగాయి. గమ్యస్దానమైన తాంబరానికి మాత్రం ఈ రైలు 10 నిమిషాల ముందే అంటే ఉదయం 9.05కు చేరుకోనుంది. ఈ మార్పులు ఫిబ్రవరి 7 నుంచి అమల్లోకి వస్తాయి. అలాగే రైలు నం.20610 తిరుచ్చిరాపల్లి -న్యూ జల్పైగురి అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ కు ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వస్తాయి.

The timings of the following Amrit Bharat Express services have been revised at select stations with effect from the dates mentioned:
— Southern Railway (@GMSRailway) January 30, 2026
🔹 Train No. 16108 Santragachi – Tambaram Amrit Bharat Weekly Express
🔹 Train No. 20610 Tiruchchirappalli – New Jalpaiguri Amrit Bharat Weekly… pic.twitter.com/vnPE7ylS4M
మార్పులు స్వల్పమే
అలాగే రైలు నం.20604 న్యూ జల్పైగురి -అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు కూడా ఏపీలోని దువ్వాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస స్టేషన్లలో టైమింగ్స్ స్వల్పంగా మార్చారు. ఈ మార్పులు ఫిబ్రవరి 1 నుంచే అమల్లోకి వస్తాయి. చివరిగా రైలు నం.16121 తాంబరం -తిరువనంతపురం అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రైలుకు కేవలం తాంబరం స్టేషన్లో మాత్రమే సమయాన్ని స్వల్పంగా మార్చారు. ఈ మార్పులను దక్షిణ రైల్వే ఎక్స్ లో ట్వీట్ చేసింది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications