Reactor Blast: అచ్యుతాపురంలో పేలిన రియాక్టర్.. ఒకరు మృతి..

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో రియాక్టర్ పేలి ఒకరు మృతి చెందారు.

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్ లో గల జీఎఫ్ఎంఎస్ ఫార్మాలో మంగళవారం పేలుడు సంభవించంది. జీఎంఎఫ్‌సీ పరిశ్రమలో రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోయింది. రియాక్టర్ పేలడంతో ఈ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులు భయంతో పరుగులు తీశారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తెచ్చారు. ఎవరైనా కార్మికులు లోపల ఉన్నారేమోనని సిబ్బంది గాలింపు చేపట్టారు.

ఈ ప్రమాదంలో ఒకరు చనిపోయారు. ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. యాక్టర్ పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో కార్మిలు భయాందోళనతో ఉన్నారు.

An explosion took place at GFMS Pharma in Achyutapuram SEZ of Anakapalli district in AP on Tuesday
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+