జగన్! చివరికి కమెడియన్, బాబు సీడీలు చూసి నేర్చుకో: ఆనం, ‘జీతాలు పెంచాలి’
నెల్లూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం నేత ఆనం వివేకానంద రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్ సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో హుందాగా వ్యవహరించారన్నారు.
ఆ సీడీలు చూసి జగన్ రాజకీయ పాఠాలు నేర్చుకోవాలని సూచించారు. జగన్ రాజకీయ విలన్గా మారాడని.. చివరకు కమెడియన్గా మిగులుతారని ఆనం వ్యాఖ్యానించారు.

ఎమ్మెల్యేల జీతాలు పెంచాలన్న వైయస్సార్ కాంగ్రెస్: కుదరదన్న ప్రభుత్వం
శాసనసభ అభివృద్ధి నిధులు ఎమ్మెల్యేలకు కేటాయించాలని వైయస్సార్ కాంగ్రెస్ సభ్యుడు గూడూరు ఎమ్మెల్యే సునీల్ అసెంబ్లీలో కోరారు.
తెలంగాణ శాసనసభ్యులకు రూ.3 లక్షల జీతం ఇస్తూ ఉంటే తమకు రూ. 1.20 లక్షలే ఇస్తున్నారని అన్నారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రస్తుతానికి శాసనసభ్యుల జీతాలు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications