ఏపీ కేబినెట్ భేటీ - 2020-21 సాధారణ, వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు ఆమోదం...
2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన బడ్జెట్ ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం సచివాలయంలోని కేబినెట్ సమావేశ మందిరంలో సమావేశమైన మంత్రివర్గం బడ్జెట్ కు సంబంధించిన పలు ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేసింది. ఇందులో 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన సప్లిమెంటరీ బడ్జెట్ తో పాటు 2020-21 బడ్జెట్ ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. దీంతో పాటు 2020-21కు సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

Recommended Video
మరోవైపు ఇవాళ కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆక్వాకల్చర్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ -2020 కోసం ఉద్దేశించిన బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోద ముద్ర పడింది.
ఆక్వాకల్చర్లో మానిటర్, ప్రమోట్, రెగ్యులేట్ మరియు డెవలప్మెంట్కోసం ఈ చట్టం తీసుకు వస్తున్నారు. అసెంబ్లీలో బడ్టెట్ కు ఆమోదం లభించిన తర్వాత ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదించబోతున్నారు.












Click it and Unblock the Notifications