సింగపూర్లో అమరావతి రైతులకు ఘన స్వాగతం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి సింగపూర్ 34 మంది రైతులు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.
Recommended Video

AP farmers Tour to Singapore సింగపూర్కు AP రైతులు : బాబు నా మజాకా | Oneindia Telugu
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి సింగపూర్ 34 మంది రైతులు సింగపూర్ చేరుకున్నారు. అక్కడ వారికి ఘనస్వాగతం లభించింది.
సింగపూర్ టీడీపీ ఫోరం ప్రతినిధులు జైరాం, చెన్నపాటి భానుచంద్ ఆధ్వర్యంలో సింగపూర్ విమానాశ్రయంలో పుష్పగుచ్ఛాలు ఇచ్చి రైతులను ఆహ్వానించారు.

సోమవారం తొలి బృందం సీఆర్డీఏ అధికారులతో కలిసి సింగపూర్ వెళ్లింది. ఈ బృందానికి చంద్రబాబు వెలగపూడి సచివాలయంలో శుభాకాంక్షలు తెలిపి పర్యటనను లాంఛనంగా ప్రారంభించారు.
నాలుగు రోజుల పాటు సింగపూర్లో వివిధ ప్రాంతాల్లో రైతులు పర్యటిస్తారు. నలభైఏళ్లలో సింగపూర్ అభివృద్ధి ఎలా సాధించిందనే అంశంపై అధ్యయనం చేసి అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించుకుంటారు.












Click it and Unblock the Notifications