ఏప్రిల్ 1 నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
హైదరాబాద్: దూరప్రాంత బస్సుల్లో 'ఇంట్రానెట్ వైఫై' సదుపాయాన్ని కల్పించేందుకు ఏపీయస్ఆర్టీసీ రంగం సిద్ధం చేస్తోంది. దీని సహాయంతో ప్రయాణికులు బస్సులో అందుబాటులో ఉంచిన సినిమాల్లో ఎవరికి నచ్చింది వారు చూడొచ్చు.
ఈ మేరకు ఏప్రిల్ 1 నుంచి 'ఇంట్రానెట్ వైపై' సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని ఆర్టీసీ అధికారులు సూత్రప్రాయంగా అంగీకరించారు. తొలుత విజయవాడ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ ప్లస్, గరుడ బస్సుల్లో దీన్ని అమలు చేయనున్నారు.

గంటపాటు ఉచితం... ఆపై రూ. 10:
ప్రయాణికులకు తమ స్మార్ట్ ఫోన్ల, టాబ్లెట్లు, ల్యాప్ టాప్ల్లో ఈ వైపై ఇంట్రానెట్ సేవలను ఉపయోగించుకోవచ్చు. అవసరమైతే డౌన్ లౌడ్ కూడా చేసుకునే వెసులుబాటుని కల్పించారు. గంట వరకు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించాలని ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఆపై రూ.10 చెలించి గమ్యం చేరేవరకు వైఫై సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.
ఆర్టీసీ ఎండీగా సాంబశివరావు సంస్ధ బాధ్యతల చేపట్టిన తర్వాత నష్టాలు తగ్గించి ఆదాయం పెంచేందుకు కొత్త ఆలోచనలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా దూర ప్రాంతాల ప్రయాణికుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బస్సులోనే కంప్యూటర్ వైఫై పరికరం ఉంటాయి. కంప్యూటర్లో సుమారు 50 సినిమాలు, దాదాపు 400 వీడియో పాటలను నిక్షిప్తం చేశారు.
-
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా












Click it and Unblock the Notifications