అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు: భారీగా పెరిగిన జీతాలు
హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. గురువారం హైదరాబాద్లో జరిగిన మంత్రి వర్గ ఉప సంఘం భేటీలో అంగన్వాడీ ఉద్యోగులకు భారీగా వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
అంగన్వాడీ ఉద్యోగుల వేతనాల అంశంపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం మంత్రివర్గ ఉపసంఘం సమావేశమై నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశానికి మంత్రులు అచ్చెన్నాయుడు, పీతల సుజాత హాజరయ్యారు.
తాజా నిర్ణయంతో అంగన్వాడీ టీచర్లకు రూ. 7,100, వర్కర్లకు రూ. 5,460 చొప్పున వేతనాలు పెరగనున్నాయి. అంతక ముందు అంగన్వాడీ టీచర్లకు రూ. 4,200, వర్కర్లకు రూ. 2,200లను వేతనాలుగా ఇచ్చేవారు.
వేతవాల పెంపుతో ప్రభుత్వంపై ఏడాదికి రూ. 315 కోట్ల అదనపు భారం పడనుందని మంత్రి వర్గ ఉపసంఘం తెలిపింది. 1.04 లక్షల మంది అంగన్వాడీ ఉద్యోగులకు లబ్ధికలగనుందని మంత్రులు ప్రకటించారు.
అధికారుల వేధింపులపై ఉద్యోగులు ధర్నా
అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులు గురువారం అనంతపురంలో ఆందోళనకు దిగారు. ఇంక్లూసివ్ రీసోర్స్ టీచర్స్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసే సుమారు 100మంది ఉద్యోగులు జిల్లా సైన్స్ సెంటర్ ఎదుట ధర్నాకు దిగారు.