చంద్రబాబుపై n440k ఫిర్యాదుల పర్వం- తాజాగా కృష్ణాజిల్లా మైలవరంలో
ఏపీలోని కర్నూల్లో ఎన్440కే వైరస్ ఉందంటూ టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతోంది. చంద్రబాబు వ్యాఖ్యలపై ఇప్పటికే కర్నూలుతో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల కేసులు నమోదవుతుండగా.. ఇవాళ కృష్ణాజిల్లా మైలవరంలోనూ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో ఎన్440కే వైరస్ ఉందంటూ వ్యాఖ్యానించడం ద్వారా చంద్రబాబు ప్రజల్ని తప్పుదోవ పట్టించారని, జనాన్ని భయభ్రాంతులకు గురి చేశారని కృష్ణాజిల్లా మైలవరం పీఎస్లో కొందరు న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుచోట్ల చంద్రబాబుపై దాఖలైన ఫిర్యాదులపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. మైలవరంలోనూ కేసు నమోదుకు సిద్ధమవుతున్నారు. దీంతో కర్నూలు, చిత్తూరు, గంటూరు, కృష్ణాజిల్లాల్లో న్యాయవాదులు చంద్రబాబుకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు.

మరోవైపు చంద్రబాబు చేసిన ఎన్ 440కే వైరస్ వ్యాఖ్యలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు.. టీడీపీ నేతలు మంత్రి అప్పలరాజు చేసిన దాదాపు ఇలాంటి వ్యాఖ్యలపై మాత్రం కేసుల వరకూ వెళ్లకపోవడం విమర్శలకు తావిస్తోంది. అప్పలరాజుపై ఫిర్యాదు చేసిన గుంటూరు టీడీపీ నేతలపై పోలీసులు ఏకంగా కోవిడ్ కేసులు నమోదు చేయడం కూడా వివాదాస్పదమైంది. దీంతో పోలీసుల తీరుపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఉన్నతాధికారుల సూచనలమేరకే పోలీసులు ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు అర్ధమవుతోంది.
-
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్..












Click it and Unblock the Notifications