మరో వివాదంలో టీటీడీ- సప్తగిరి మాసపత్రికలో రామాయణం వక్రీకరణ ? బీజేపీ గరంగరం...
తిరుమల, తిరుపతి దేవస్ధానం మరో వివాదంలో చిక్కుకుంది. లాక్ డౌన్ కారణంగా దర్శనాలు నిలిచిపోయి అసలే కష్టాల్లో ఉన్న సమయంలో టీటీడీకి చెందిన సప్తగిరి మాసపత్రికలో ప్రచురితమైన ఓ వ్యాసమే ఇందుకు కారణం. ఈ వ్యాసంలో సీతకు ఒక్కడే కుమారుడు లవుడని, కుశుడు దర్భతో చేసిన బొమ్మ అంటూ టీటీడీ ప్రచురించింది. మాసపత్రికలోని ఓ జానపద కథలో ఇది ప్రచురితమైంది. దీనిపై ఇప్పుడు కొత్తగా వివాదం మొదలైంది.
ఈ కథను తిరుపతికి చెందిన తొమ్మిదో తరగతి బాలుడు పునీత్ రాయగా.. టీటీడీ తన మాసపత్రిక సప్తగిరిలో ప్రచురించింది. టీటీడీ వంటి ధార్మిక సంస్ద వాల్మీకి రామాయణాన్ని పరిగణనలోకి తీసుకోకుండా జానపథ కథల ద్వారా దాన్ని వక్రీకరిస్తోందని బీజేపీ నేతలు భగ్గుమంటున్నారు.

జానపదాల్లో రకరకాల ప్రచారాలపై ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా రామాయణాన్ని తప్పుదారి పట్టించినట్లు అవుతుందని వారు తెలిపారు. మరోవైపు రామాయణాన్ని వక్రీకరిస్తూ టీటీడీ మానసపత్రికలో కథనంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!!












Click it and Unblock the Notifications