వైసీపీకి మరో దెబ్బ..! ఎమ్మెల్సీ డ్రైవర్ కేసులో కోర్టు కీలక నిర్ణయం..!
ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఓటమితో అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీకి మొదలైన ఎదురుదెబ్బలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మద్యం స్కాం కేసు ఆ పార్టీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. మరోవైపు జగన్ పర్యటనల్లో నమోదైన కేసుల విషయంలో మాజీ మంత్రులు సైతం పోలీసుల విచారణకు హాజరవుతున్నారు. ఇదే సమయంలో ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
2022లో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రమణ్యాన్ని అత్యంత దారుణంగా కొట్టి చంపేసి మూట గట్టి అతని ఇంట్లోనే పడేసిన వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తానే ఈ హత్య చేసినట్లు అనంతబాబు ఇప్పటికే పోలీసుల విచారణలో అంగీకరించారు. దీంతో ఈ కేసు ముగించేందుకు పోలీసులు సిద్దమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించి ఈ కేసులో సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించింది. ఈ మేరకు కోర్టు అనుమతి కోరింది.

ప్రత్యేక దర్యాప్తు బృందం వినతిపై విచారణ జరిపిన రాజమండ్రిలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో తదుపరి విచారణకు అనుమతి ఇచ్చింది. అయితే 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి ఈ కేసులో పూర్తిస్దాయిలో విచారణ జరిపేందుకు పోలీసులు సిద్దమవుతున్నారు. ప్రస్తుతం అనంతబాబు బెయిల్ పై బయటే ఉన్నారు. కోర్టు తాజా ఆదేశాలతో ఆయన్ను మరోసారి అరెస్టు చేసి విచారణ జరిపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు.

కూటమి సర్కార్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విపక్షంలో ఉన్నప్పుడే కూటమి పార్టీలు అనంతబాబు డ్రైవర్ హత్య కేసును రాజకీయంగా వాడుకున్నాయి. తద్వారా ఎస్సీ వర్గాల ఓట్లను ఆకర్షించాయి. ఇప్పుడు అధికారంలో ఉండటంతో ఈ కేసులో న్యాయ సలహాల కోసం ప్రత్యేకంగా లాయర్ ముప్పాళ్ల సుబ్బారావును నియమించారు. తద్వారా అనంతబాబుకు శిక్ష పడేలా చూసేందుకు కూటమి సర్కార్ ప్రయత్నిస్తోంది.
-
వైసీపీ జోలికెళ్లను, జగన్ టార్గెట్ కాదు-రూటుమార్చిన షర్మిల..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications