స్పీకర్ తమ్మినేనికి తప్పిన ప్రమాదం- ఆటోను ఢీకొట్టిన కాన్వాయ్
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. శ్రీకాకుళం జిల్లా వంజంగి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారు. కాన్వాయ్లోని కారు స్వల్పంగా దెబ్బతింది. స్పీకర్ పర్యటనలో ప్రమాదం జరగడంతో జిల్లాకు చెందిన వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన సొంత జిల్లా శ్రీకాకుళంలో విస్తృతంగా పర్యటిస్తుంటారు. ప్రజలతో మమేకం అవుతుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ వంజంగి వెళ్తుండగా ఆయన కాన్వాయ్లో కారుకు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కాన్వాయ్కు ఆటో అడ్డుగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇందులో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వీరిని స్ధానికంగా ప్రాధమిక చికిత్స అందించారు.

Recommended Video
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తమ్మినేని సీతారాం.. తాను సభాపతి అయినప్పటికీ ప్రజలు, నేతలతో సత్సంబంధాలు నెరుపుతుంటారు. జిల్లాలోని ఇతర వైసీపీ నేతలతో కూడా ఆయకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఎవరు ఏ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా హాజరవుతుంటారు. అలాగే జిల్లాకు చెందిన నేతలు, స్ధానికులు అమరావతి వచ్చినా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారిని కలుస్తుంటారు. దీంతో స్పీకర్ కాన్వాయ్కు ప్రమాదం జరిగిందని తెలిసి వారు ఆందోళన చెందారు. తమ్మినేని సురక్షితంగా బయటపడ్డారని తెలిసి ఆ తర్వాత ఊపిరిపీల్చుకున్నారు.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications