AP Budget: ఈసారి బడ్జెట్ లో 5 పథకాలపై ఫోకస్-ప్రత్యేక నిధులు..!
ఏపీలో ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నెల 14న బడ్జెట్ (ap budget)ను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందులో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలపై కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ వివిధ శాఖల మంత్రులతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఆయాశాఖల్లో ఉన్న అవసరాల్ని తెలుసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా బడ్జెట్ కూర్పు చేయబోతున్నారు.
ఆ 5 పథకాలపై బడ్జెట్ లో ఫోకస్ (ap budget)
అయితే ఈసారి బడ్జెట్ లో ఐదు ముఖ్యమైన పథకాలపై ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో ఇప్పటికే అమలు చేస్తున్న తల్లికి వందనం, దీపం 2.0, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాలు ఉన్నాయి. వీటిని గతేడాది విజయవంతంగా లబ్దిదారులకు అందించిన ప్రభుత్వం.. ఈసారి కూడా పక్కా కేటాయింపులతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని నిర్ణయించింది. వీటితో పాటు ఇతర పథకాలకూ నిధుల కేటాయింపు ఉంటుంది.

కీలక ప్రాజెక్టులకూ నిధులు
మరోవైపు రాష్ట్రంలో కీలకమైన పోలవరం, రాజధాని అమరావతి పనులకు కూడా బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో నీటి ప్రాజెక్టుల పూర్తికి నిధులు కేటాయించాలని కూడా భావిస్తోంది. వీటితో పాటు పారిశ్రామిక రంగానికి కూడా బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నారు. ఇక రోడ్లు, లాజిస్ట్టిక్స్, హార్టికల్చర్, జల్ జీవన్ మిషన్ వంటి అవసరాల కోసం కూడా తగినన్ని నిధులు ఇచ్చేలా ఆర్థికమంత్రికి చంద్రబాబు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. దీంతో బడ్జెట్ లో వీటన్నింటికీ నిధుల కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications