విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని: మోదుగుల
హైదరాబాద్: విజయవాడు, గుంటూరు మధ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని తమ పార్టీ భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. దానివల్లనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే విషయంలో ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఇందులో కుట్ర లేదని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గురువారంనాడు తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వారితో చర్చలు జరిపారు.
-
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
సింహరాశి, కన్యారాశి మే నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
CSK vs RCB: కొంపముంచిన నోబాల్.. చెన్నైని చిత్తు చేసిన ఆర్సీబీ! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
తిరుపతికి కొత్తగా అమృత్ భారత్, వందేభారత్ స్లీపర్ - రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
ఉపాసన, కావ్య మారన్ కు సీఎం రేవంత్ కీలక బాధ్యతలు..!!












Click it and Unblock the Notifications