విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని: మోదుగుల
హైదరాబాద్: విజయవాడు, గుంటూరు మధ్య ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని తమ పార్టీ భావిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. దానివల్లనే తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని ఆయన చెప్పారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపే విషయంలో ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని ఆయన అన్నారు. ఇందులో కుట్ర లేదని స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో వేదిక ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఈ నేపథ్యంలోనే చంద్రబాబు గురువారంనాడు తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సమావేశమయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై వారితో చర్చలు జరిపారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications