Margadarsi : మార్గదర్శి విచారణ పేరుతో వేధింపులు-ఏపీ సీఐడీ వివరణ ఇదే..!
ఏపీలో మార్గదర్శి చిట్స్ అక్రమాల వ్యవహారంలో సీఐడీ దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ కేసులో ఏ1 అయిన ఈనాడు గ్రూపు సంస్ధల అధినేత రామోజీరావుతో పాటు ఏ2గా ఉన్న మార్గదర్శి చిట్స్ ఎండీ శైలజా కిరణ్ ను సీఐడీ తాజాగా ప్రశ్నించింది. అయితే విచారణ పేరుతో తమను వేధిస్తున్నారంటూ వీరు చేస్తున్న ఆరోపణలపై ఇవాళ సీఐడీ అధికారులు విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో వారు మార్గదర్శి కేసు విచారణపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు.
మార్గదర్శి విషయంలో సీఐడీ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని సీఐడీ అదనపు ఎస్పీ రవికుమార్ తెలిపారు. మార్గదర్శి విషయంలో చట్టబద్ధంగానే విచారణ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చట్ట ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇంటికెళ్లి వేధింపులకు గురి చేస్తున్నాం అనేది అవాస్తవమన్నారు. మార్గదర్శి కేసులో నిన్న ఎండీ శైలజా కిరణ్ విచారణకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు.

విచారణ సమయంలో శైలజా కిరణ్ కు అన్ని సదుపాయాలు కల్పించినట్లు సీఐడీ అదనపు ఎస్పీ తెలిపారు. విచారణ నిజాయితీగా పారదర్శకంగా చేస్తున్నామన్నారు. సీఐడీ అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిన్న విచారణకు వెళ్ళినప్పుడు అధికారులను అడ్డుకున్నారని, మార్గదర్శి ఎండీ శైలజ నిన్నటి విచారణలో 25 శాతం మాత్రమే సమాధానం చెప్పారని అదనపు ఎస్పీ రవికుమార్ పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా సీఐడీ విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు.
మార్గదర్శి కేసు విచారణలో నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛకు ఎలాంటి భంగం లేకుండా చూస్తున్నామన్నారు. అలాగే వారికి అనారోగ్యమని చెబితే అవసరమైన ట్యాబ్లెట్లు అందించి, భోజనం వంటి సదుపాయాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. విచారణపై వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!











Click it and Unblock the Notifications