Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మెగా PTM 3.0 : మన్యం జిల్లాలో సీఎం, మంత్రి లోకేష్.. చిన్నారితో భలే ఘటన !!

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 45 వేల ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. ఈ క్రమంలోనే పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలోని భామిని మోడల్‌ స్కూల్‌లో.. జరిగిన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి లోకేష్‌ హాజరయ్యారు. ఈ మీటింగ్ కి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.

కాగా పాఠశాలకు వెళ్లిన సీఎం చంద్రబాబు ముందుగా నేరుగా విద్యార్థుల తరగతులను పరిశీలించారు. తర్వాత విద్యార్థులతోపాటు క్లాస్ రూములో కాసేపు కూర్చొని డిజిటల్ పాఠాలు ఉపాధ్యాయులు ఏ విధంగా బోధన చేస్తున్నారనేది తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కూర్చుని వారితో ముచ్చటించారు. అలానే వారి ప్రోగ్రెస్ కార్డులను కూడా పరిశీలించారు.

ap-cm-chandrababu-and-nara-lokesh-participated-in-mega-parent-teacher-meeting-3-o

చిన్నారితో ఆసక్తికర ఘటన..

ఈ క్రమంలోనే ఒక ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు తన చేతిలో ట్యాబ్ పట్టుకొని ఓ చిన్నారి వద్దకు తీసుకెళ్లారు. అందులో ఉన్న అంశాన్ని చదవాలని సూచించగా.. చిన్నారి చదివే ప్రయత్నం చేయడంతో ముఖ్యమంత్రి అభినందించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+