స్పీడ్ రైలులో బ్యూసన్ సిటీకి... దక్షిణకొరియాలో చంద్రబాబు రెండోరోజు పర్యటన
సియోల్: దక్షిణ కొరియాలో ఏసీ సీఎం చంద్రబాబు నాయుడి పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు కొరియాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం చంద్రబాబు దక్షిణ కొరియాలోని పారిశ్రామిక నగరం బ్యూసన్ సందర్శన కోసం స్పీడ్ రైలులో వెళ్లారు. సీఎం చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం సోమవారం దక్షిణ కొరియాకు చేరుకున్నారు.

తొలిరోజే సుమారు రూ.8 వేల కోట్ల విలువైన పెట్టుబడులను సాధించడంలో విజయవంతమయ్యారు. 37 కొరియా సంస్థలు ఏపీలో రూ.3 వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సుముఖత తెలిపాయి.
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవల్పమెంట్ బోర్డు (ఏపీఈడీబీ)తో లెటర్ ఆఫ్ ఇంటెంట్ టు ఇన్వెస్ట్స్టమెంట్(ఎల్వోఐ)పై సంతకాలు చేశాయి. ఈ సంస్థల ద్వారా ప్రత్యక్షంగా 7171 ఉద్యోగాలు రానున్నాయి. వీటితోపాటు కియా అనుబంధ సంస్థలన్నీ కలిపి రాష్ట్రంలో రూ.4995.20 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపాయి.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications