మనవడితో 7 రోజులు: దేవాన్ష్తో కలసి విమానమెక్కిన చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనకు వెళ్లారు. నిత్యం పరిపాలన, రాజధాని నిర్మాణ పర్యవేక్షణ, మంత్రులు ఉద్యోగులతో సమీక్షలతో బిజీగా గడిపే సీఎం చంద్రబాబు నాయుడు వాటి నుంచి సేదదీరేందుకు వారం రోజుల విదేశీ పర్యటనకు కుటుంబ సభ్యులతో కలిసి పయనమయ్యారు.
చంద్రబాబు వ్యక్తిగత పర్యటనగా పేర్కొంటున్న ఈ విదేశీ పర్యనటలో ఆయనతో పాటు భార్య భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్లు ఆయన వెంట వెళ్లారు. ఈ పర్యటనలో భాగంగా తొలుత చంద్రబాబు కుటుంబం థాయ్లాండ్ వెళ్లనున్నారు.

ఆ తర్వాత అక్కడ నుంచి స్విట్జర్లాండ్లో ఆయన కుటుంబం గడపనున్నట్టు తెలుగుదేశం పార్టీ అధికార వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా తన మనవడు దేవాన్ష్తో ఆయన గడిపేందుకే ఈ పర్యటనను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి బయల్దేరి వెళ్లిన చంద్రబాబు తిరిగి వారం రోజుల తర్వాత అంటే ఈ నెల పదిహేవ తేదీన విజయవాడకు చేరుకుంటారు.
తాను విదేశీ పర్యనటకు వెళ్తున్న క్రమంలో మంత్రులంతా విజయవాడలోనే ఉండి పరిపాలనకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని చంద్రబాబు ఆదేశించినట్టుగా తెలుస్తోంది.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు!












Click it and Unblock the Notifications