జయలలితకు లేఖ రాస్తా, దాని గురించి మాట్లాడను: చంద్రబాబు, సింగపూర్ పయనం
చెన్నై: తమిళనాడులో తెలుగును తొలగించడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం నాడు అభిప్రాయపడ్డారు. ఈ విషయమై తను తమిళనాడు ముఖ్యమంత్రి జయలితకు లేఖ రాస్తానని, మాట్లాడుతానని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సింగపర్లా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాను దాని గురించి ఇప్పుడే మాట్లాడనని చెప్పారు. ఇప్పటికీ ఎర్ర చందనం స్మగ్లింగ్ కొనసగుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా, ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం నాడు సింగపూర్ బయలుదేరారు. ఈ సందర్భంగా చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. అక్టోబర్ 22వ తదేదీన రాజధాని శంకుస్థాపనకు సింగపూర్ ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.
సింగపూర్ లోని విభిన్న ప్రాంతాల పరిశీలనలు, ముఖ్యులతో సమావేశాలు తదితర కార్యక్రమాలలో సిఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర బృందం పాల్గొంటుంది. చంద్రబాబుతో పటు మంత్రులు యనమల రామకృష్ణుడు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సిఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ తదితరులు ఉన్నరు. 21, 22 తేదీల్లో చంద్రబాబు సింగపర్లో పర్యటిస్తారు.












Click it and Unblock the Notifications