అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఢిల్లీ చేరుకున్న బాబు, హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదన్న ఎంపీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకున్నారు. వినామాశ్రయం నుంచి బయలు దేరిన ఆయన ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేశారు. మంగళవారం మంత్రి వర్గ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.

ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఫోన్ సంభాషణలు మీడియాలో విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఉమ్మడి రాజధానిలో సీఎం చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ చేశారని, రాజధానిపై సర్వాధికారాలన్నీ గవర్నర్‌కు కల్పించాలని కేంద్రాన్ని కోరనున్నట్టు తెలుస్తోంది.

AP CM Chandrababu Naidu Reached Delhi

హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదన్న ఎంపీ

హైదరాబాద్ కేసీఆర్ కుటుంబ జాగీరు కాదని కాకినాడ ఎంపీ తోట నరసింహం అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేసే ముందు కేంద్ర హోం శాఖ అనుమతి తీసుకోవాలని, కేంద్రం అనుమతి లేకుండా సీఎం చంద్రబాబు ఫోన్‌ను ట్యాప్ చేయడం ఏంటని ప్రశ్నించారు.

ఈ ఫోన్ ట్యాపింగ్‌పై తెలుగుదేశం పార్టీ ఎంపీలంతా కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధాని అని, హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత హక్కుందో, ఏపీకి అంతే హక్కుందని అన్నారు.

English summary
AP CM Chandrababu Naidu Reached Delhi on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X