మార్కాపురం ప్రమాద ఘటన: చంద్రబాబు దృష్టికి ప్రమాద కారణం, సీఎం రేవంత్ దిగ్భ్రాంతి!
మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఈరోజు ఘోర బస్సు ప్రమాద ఘటన చోటు చేసుకుంది. ఒక టిప్పర్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగి ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో ఇప్పటివరకు 13 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరికొందరు తీవ్ర గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మార్కాపురం ప్రమాద ఘటనపై తెలంగాణా సీఎం రేవంత్
ఈ ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ ఘటన పైన ఏపీ అధికారులతో మాట్లాడాలని ఆయన సి ఎస్ రామకృష్ణారావును ఆదేశించారు.

బస్సు ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష
బస్సు జగిత్యాల నుంచి బయలుదేరిన క్రమంలో బస్సులో ఉన్న తెలంగాణాకు చెందిన ప్రయాణికుల వివరాలను తెలుసుకోవాలన్నారు. సీఎం ఆదేశాలతో ఏపీ సీఎస్ తో తెలంగాణ సిఎస్ మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఇదిలా ఉంటే బస్సు ప్రమాద ఘటన పైన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు మంత్రులు, అనిత జనార్దన్ రెడ్డి తోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమం
ప్రమాదం జరిగిన తీరు పైన ప్రాథమిక సమాచారాన్ని సీఎంకు జిల్లా కలెక్టర్, ఎస్పీ వివరించారు. ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ఉన్నారని, వారిలో 13 మంది మృతి చెందారని, 22 మంది గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ప్రమాదానికి గురైన హరికృష్ణ ట్రావెల్స్ బస్సు తెలంగాణలో జగిత్యాల నుండి వస్తున్నట్టు పేర్కొన్నారు.
బాధితులకు నష్ట పరిహారం ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు
బస్సు డ్రైవర్ ను విచారిస్తే స్టీరింగ్ స్ట్రక్ అయినట్టు చెప్పారని, అందువల్లే ఆక్సిడెంట్ జరిగినట్టుగా చెప్పారని వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం తో పాటు బాధితులకు నష్టపరిహారం కూడా ఇవ్వాలని ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
-
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
ఏలినాటి శని వెంటాడుతోందా? 'పొంగు శని'ని దర్శించుకుంటే అష్టైశ్వర్యాలే! -
బంగారం ధరల్లో లాభాల మోత -
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం












Click it and Unblock the Notifications