పోలవరం ప్రాజెక్ట్ జాతికి అంకితం చేసే ముహూర్తం ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడిగా పరిగణించబడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని శరవేగంగా పనులు చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాల కోసం నేడు హస్తినకు వెళుతున్నారు.
పోలవరం ప్రాజెక్ట్ నిధుల కోసం చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఈ పర్యటనలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుకు పెండింగ్లో ఉన్న బకాయిల విడుదల, పునరావాస ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలు, కొత్త ప్రాజెక్టుల అనుమతులపైన కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ తో చర్చించి నిధుల విడుదల ప్రక్రియను వేగవంతం చేయాలని చర్చించనున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ పై శుభవార్త చెప్పిన చంద్రబాబు
ఈ క్రమంలోనే తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపైన శుభవార్త చెప్పారు. 2027 పుష్కరాల కంటే ముందే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. గతంలో 480 కోట్లతో నిర్మిస్తే దానిని కాపాడలేక గత ప్రభుత్వం నాశనం చేసిందని, మళ్లీ ఇప్పుడు వెయ్యి కోట్లతో నిర్మాణం చేస్తున్నట్టు త్వరలోనే అది పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు.
2026 జూన్ నాటికి డయాఫ్రం వాల్ పూర్తి
పోలవరం ప్రాజెక్టును నిర్మించిన జాతికి అంకితం చేయడమే ప్రస్తుతం తమ ముందు ఉన్న లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యలు చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందే పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న క్రమంలోని చంద్రబాబు నిధుల కోసం కేంద్రంపైన ఒత్తిడి తీసుకురానున్నారు. 2026 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తి అవుతుందని దీనిని నిర్మాణం చేస్తున్నబవర్ కంపెనీ ప్రకటించింది.
పోలవరం ప్రాజెక్ట్ పనులలో పెరిగిన వేగం
ఇప్పటికే దాదాపు 93 శాతానికి పైగా పనులు పూర్తికాగా మిగతా పనులలో వేగం పెంచారు. ఏది ఏమైనా చంద్రబాబు కలల ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనక్కి తగ్గేది లేదని తేల్చి చెబుతోంది. ఈ క్రమంలోనే చంద్రబాబు కేంద్ర సహకారంతో పోలవరం ప్రాజెక్టును 2027 గోదావరి పుష్కరాల కంటే ముందే ప్రారంభించి జాతికి అంకితం చేయాలని సంకల్పించి ముందుకు వెళుతున్నారు.
-
AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు బిగ్ అలర్ట్..! ఇంకా ఐదు రోజులే ఆఫర్.. -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
విద్యుత్ ఛార్జీల పై ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇక కొత్తగా..!! -
ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో అడ్మిషన్లపై కీలక అప్డేట్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం!











Click it and Unblock the Notifications