వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధాని, పోలవరంపై చర్చిస్తాం: ఛత్తీస్‌గఢ్‌లో చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

రాయ్‌గఢ్/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పార్టీకి చెందిన ఎంపీలు, పారిశ్రామికవేత్తలతో కలిసి సోమవారం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో పర్యటించారు. రాయ్‌పూర్‌కు చేరుకున్న చంద్రబాబు నాయుడు బృందానికి ఆ రాష్ట్ర మంత్రి రాజీవ్‌మూరత్ స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుుడు మాట్లాడుతూ.. నయారాయ్‌పూర్ నిర్మాణం పరిశీలించేందుకు ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడతామని చెప్పారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు, ప్రజాపంపిణీ వ్యవస్థపై ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్‌తో చర్చించనున్నట్లు తెలిపారు.

AP CM Chandrababu visits Naya Raipur

సిఎం చంద్రబాబు నాయుడుతోపాటు మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరరావు, రావెల కిషోర్‌బాబు, పలువురు ఉన్నతాధికారులు చంద్రబాబు బృందంలో ఉన్నారు.

వీరితోపాటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గల్లా జయదేవ్, పారిశ్రామికవేత్తలు నవయుగ అధినేత విశ్వేశ్వరరావు, భారత్ బయోటెక్ అధిపతి కృష్ణా, ఎస్ఎంఎస్ ఫార్మా అధ్యక్షుడు రమేష్, శ్రీసిటీ ఛైర్మన్ శ్రీనిరాజు, సిఐఐ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు కన్నర్ బాబు వెంట ఉన్నారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu and his team on Monday visited Chattisgarh capital Naya Raipur, and he will meet CM Raman singh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X