Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా .. అమిత్ షా తో అపాయింట్మెంట్ క్యాన్సిల్ .. ఎందుకంటే

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దయింది. నేడు ఢిల్లీ వెళ్లనున్న సీఎం పలు అంశాలపై అమిత్ షా తో చర్చించాలని భావించారు. గత వారం ఢిల్లీ వెళ్ళిన సీఎం ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వచ్చారు. ఏపీ కోసం వినతులను ఆయనకు చెప్పి వచ్చారు. కానీ అప్పుడు సైతం అమిత్ షా ను కలవలేకపోయారు. ఇప్పుడు మరోమారు అమిత్ షా అందుబాటులో లేకపోవడంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన రద్దు చేసుకున్నారు.

మహారాష్ట్ర ఎన్నికల హడావిడిలో అమిత్ షా ఉన్న నేపథ్యంలో జగన్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడం వీలుపడదని హోంశాఖ కార్యాలయం నుంచి సమాచారం అందడంతో జగన్ పర్యటన రద్దయింది. గతంలో సైతం అమిత్ షా తో భేటీ అపాయింట్మెంట్ దొరక్క రద్దయిన పరిస్థితి. ఇక ఇప్పుడు సైతం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో జరగాల్సిన వైఎస్ జగన్ భేటీ మరోసారి రద్దయింది. జగన్ కు ఇచ్చిన అపాయింట్ మెంట్ ను రద్దు చేసుకుంటున్నట్టు అమిత్ షా కార్యాలయం నుంచి జగన్ కు సమాచారం అందింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలోనే అపాయింట్ మెంట్ క్యాన్సిల్ అయినట్టు సమాచారం.

AP CM Jagan postpone trip to Delhi .. appointment cancelled with Amit Shah

మహారాష్ట్ర, హర్యానా రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల పర్వం ముగిసి, ప్రచారం అయిపోయేంత వరకూ అమిత్ షా బిజీగా ఉంటారని, ఎవరికీ విడిగా అపాయింట్లు ఇచ్చే పరిస్థితి లేదని హోమ్ శాఖ అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఇటీవలి కాలంలో అమిత్, జగన్ ల భేటీ రద్దు కావడం ఇది రెండోసారి. గత వారం ఢిల్లీ పర్యటనలో భాగంగా మోదీని కలిసిన జగన్, హోమ్ మంత్రిని మాత్రం కలవలేకపోయారు. ఇప్పుడు మరోసారి ప్రయత్నం చేసి అపాయింట్మెంట్ క్యాన్సిల్ కావడంతో కలవలేక పోతున్నారు. ఎన్నికల సమయం కావడంతో అమిత్ షా బిజీగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+