కేసీఆర్ ఓటమిని జగన్ ముందే ఊహించారా..? అందుకే కీలక అనుచరుడును కాంగ్రెస్లోకి పంపించారా..?
తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏకపక్షంగా సాగుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ నిజం చేస్తూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. సులువుగా మ్యాజిక్ ఫిగర్ను కాంగ్రెస్ పార్టీ దాటేలా కనిపిస్తుంది. ఆ పార్టీ అభ్యర్థులు 65కు స్థానాలకు పైగానే అధిక్యంలో ఉండటం ఇందుకు నిదర్శనం. దీంతో తెలంగాణలో అధికారం చేపట్టడానికి ఆ సిద్ధం అవుతుంది.
కాంగ్రెస్ పార్టీ గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలిసారి అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నాయకులు ఆనందానికి హద్దే లేకుండా పోయింది. మూడోసారి విజయం ఖాయం అనుకున్న బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాకే ఇచ్చారు ఓటర్లు. ఆ పార్టీకి 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.

ఇదిలా ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఏపీ సీఎం జగన్ ముందే ఊహించారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణలో కేసీఆర్ ఓడిపోతున్నారని తెలిసే ..జగన్ తన అనుచరులను కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగానే జగన్ తెలంగాణలోని తన కీలక అనుచరుడైనా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని జగన్ కాంగ్రెస్ పార్టీలోకి పంపించారని అంటున్నారు.
ఎన్నికల ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికార బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరే ముందే ఏపీ సీఎం జగన్తో భేటీ అవ్వడమే దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు. జగన్ సూచనతోనే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు సమాచారం. పొంగులేటితో పాటు వెంట ఆయన అనుచరులు, అభిమానులు భారీగా సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
దీనికి తోడు ఖమ్మం జిల్లాలో పొంగులేటి తన అనుచరులకు టిక్కెట్లు ఇప్పించడమే కాకుండా , వారిని గెలిపించే పూర్తి బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో జిల్లా మొత్తం పొంగులేటి హవానే కనిపించింది. జిల్లాలో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కు దక్కనివ్వనని చెప్పి ..ఆ శపథాన్ని నిలబెట్టుకున్నారాయన.
జగన్ సూచనతోనే పొంగులేటి ,ఆయన అనుచరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.తెలంగాణలో అధికార పార్టీ ఓటమిని ముందే పసిగట్టిన జగన్ ..తన అనచరుడును కాంగ్రెస్ పార్టీలో చేర్పించి తద్వారా ఆయనకు విజయాన్ని అందించారు. మొత్తానికి కేసీఆర్ ఓటమిని ముందే ఊహించిన జగన్ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలోకి తన అనుచరుడును పంపించారని రాజకీయ విశ్లేషకులు భవిస్తున్నారు.
-
`ఉస్తాద్` విషయంలో తెలిసి చేశారో తెలియక చేశారో గానీ.. !! -
కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు - ముహూర్తం ఫిక్స్..!! -
ఉప ప్రధానిగా బాబు, సీఎంగా లోకేష్? పవన్ తో వైసీపీ షాకింగ్ రియాక్షన్..! -
సాంస్కృతిక ఉత్సవాల్లో అదరగొట్టిన కూటమి నేతలు.. హైలైట్గా డిప్యూటీ స్పీకర్ ! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, మూడు రోజుల్లో పూర్తి..!! -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
అతడు ఇప్పుడు పక్కా మెంటల్లీ టఫ్: రవిశాస్త్రి -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
భారత్ కు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్..












Click it and Unblock the Notifications