Viral Video: పంట పొలాల్లో పవన్..! బురదలోనే అడుగులేస్తూ..!
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ దివిసీమ పర్యటనకు వెళ్లారు. మొంథా తుపాన్ కారణంగా ప్రభావిత మైన అవనిగడ్డ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు. ఇక్కడ నీట మునిగిన పొలాలను ఆయన స్వయంగా పరిశీలిస్తున్నారు. వరద నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులతో కలిసి పవన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పంట పొలాల్లో బురదలోకి దిగి మరీ నడుస్తున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
మొంథా తుపాన్ నేపథ్యంలో రెండు రోజులుగా అమరావతి సచివాలయంలోని ఆర్టీజీఎస్ సెంటర్లో సీఎం చంద్రబాబుతో కలిసి సహాయక చర్యల్ని పర్యవేక్షించిన పవన్ కళ్యాణ్.. ఇవాళ తుపాన్ ప్రభావం తగ్గడంతో క్షేత్రస్థాయికి వెళ్లారు. జనసేన ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవనిగడ్డ నియోజకవర్గంపై తుపాను ప్రభావం చాలా ఉంది. మచిలీపట్నం తీరానికి దగ్గర్లో ఉన్న ఈ నియోజకవర్గంలో భారీ ఎత్తున పంట పొలాలు నీట మునిగాయి.

ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ ఉదయం స్థానిక ఎమ్మెల్యే మండలి బుద్ద ప్రసాద్ తో పాటు వివిధ శాఖల అధికారులతో కలిసి పంటపొలాల్ని పరిశీలిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ స్వయంగా బురద నిండిన పంట పొలాల్లోకి దిగి మరీ పరిశీలించారు. అధికారుల్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. పంట నష్టం పరిశీలించిన స్వయంగా రైతుల్ని కలిసి వివరాలు తీసుకుంటారు. అనంతరం ప్రభుత్వానికి అధికారులు నివేదిక సమర్పిస్తారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !!












Click it and Unblock the Notifications