'విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం' (ఫోటోలు)
విశాఖపట్నం: విశాఖలో పెట్రోలింగ్ కార్లు, బస్సు, మోటార్ సైకిళ్లను, ట్రాఫిక్ పోలీసు సబ కంట్రోల్ను శుక్రవారం రాష్ట్ర డీజీపీ జెవి రాముడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ విశాఖను స్మార్ట్ సిటీగా చూడాలంటే ముందుగా సేఫ్ సిటీగా చేయడం ముఖ్యమన్నారు.
నిధుల కొరత ఉన్నప్పటికీ ప్రజల రక్షణ కోసం, వారికి సత్వర సేవలు అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని పోలీసు వాహనాలకు నిధులు కేటాయించిందన్నారు. తొలుత నగరంలోని ఆర్కే బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఔట్ పోస్టును ప్రారంభించారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
అనంతరం నగరానికి ఇటీవల వచ్చిన 53 రక్షక్, ద్విచక్ర వాహనాలను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ప్రజల భాగస్వామ్యంతో భద్రత సాధ్యమవుతుందని చెప్పారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
పోలీసు బలగాలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళికలను తీసుకొచ్చిందన్నారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
ఇందులో భాగంగా నగర పోలీసు కమిషనరేట్కు కొత్త వాహనాలు సమకూర్చినట్లు తెలిపారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
కార్యక్రమంలో తమకు సహాయ సహకారాలు అందించిన యాడ్ సంస్ధకు చెందిన పురషోత్తమనాయుడు, సీఎంఆర్ అధినేత మావూరి వెంకటరమణ, ఆర్. బాలాజీలను ఆయన ఘనంగా సత్కరించారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
ఉత్తరాంధ్రలో అంతరాష్ట్ర ముఠాలపై నిఘా పెట్టాలని సూచించారు. విశాఖ పరధిలోకి వచ్చే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కమిషనరేట్ ఎస్పీలతో సమావేశమయ్యారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
ఇతర రాష్టాల నుంచి వచ్చి దొంగతనాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

విశాఖను సేఫ్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం: రాముడు
విశాఖ రేంజి పరిధిలో నేరాల నియంత్రణకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై స్కూలు పిల్లల్లో అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు.












Click it and Unblock the Notifications