అంబేడ్కర్ రాజ్యాంగాన్ని కాల్చేయమన్నారు, ఇది నిజం: విభజనపై సుజన
న్యూఢిల్లీ: ఎప్పుడైనా రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే అలాంటి సమయంలో రాజ్యాంగాన్ని కాల్చేయమని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ చెప్పారని కేంద్రమంత్రి, టిడిపి నేత సుజనా చౌదరి సోమవారం రాజ్యసభలో అన్నారు.
ఆంధ్రప్రదేశ్ విభజన నాడు సరైన రీతిలో జరగలేదన్నారు. ముమ్మాటికి విభజన అసంబద్ధంగా జరిగిందన్నారు. అప్రజాస్వామికంగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచనే లేదన్నారు. పార్లమెంటులో విభజన బిల్లు ఆమోదం పొందిన తీరు ఏపీలోని ప్రతి ఒక్కరినీ కలచివేసిందన్నారు.

రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్ణయాలు జరిగితే దానిని కాల్చేయాలని అంబేడ్కర్ చెప్పారని, దీనిని తాను ఆయనపై గౌరవంతో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చి 18 నెలలు గడుస్తోందని, ఇప్పటికీ తాము సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నామన్నారు.
చట్ట సభల సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఏపీకి న్యాయం చేయాలన్నారు. కాగా, విభజన అసంబంధంగా జరిగిందని సుజనా చౌదరి చెబుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
-
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్!












Click it and Unblock the Notifications