జగన్ సర్కార్ తో తేలని ఉద్యోగుల చర్చలు-ఛలో విజయవాడ యథాతథం..!
ఏపీలో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న తమ సమస్యలపై ఇవాళ ఏర్పాటు చేసిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్న ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. వారు ప్రస్తావించిన డిమాండ్లపై ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఐఆర్ ఇచ్చే విషయంలో పూర్తిగా వెనుకడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఈ నెల 27న తలపెట్టిన ఛలో విజయవాడ యథాతథంగా కొనసాగుతుందని ప్రకటించాయి.
ఉద్యోగులకు మధ్యంతర భృతి ఇవ్వడం తమ ప్రభుత్వ విధానం కాదని చర్చల తర్వాత మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. పూర్తి స్థాయిలో పీఆర్సీ నే ప్రకటిస్తామని ఉద్యోగులకు చెప్పామన్నారు. గతంలో కరోనా వల్ల పీఆర్సీ ప్రకటించ లేక పోయామని, పీఆర్సీ ఆలస్యం అయితేనే మధ్యంతర భృతి ఇస్తారని తెలిపారు. తాము పీఆర్సీ నే ఇస్తామని చెబుతున్నామని, ఇక ఐఆర్ ఎందుకని అడిగారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దకరణకు ప్రభుత్వం ఆలోచిస్తోందని బొత్స తెలిపారు. కానీ కోర్టు కేసుల వల్ల నిలిచిపోయిందన్నారు. ప్రభుత్వం అన్ని అంశాలలో ప్రజాస్వామ్య బద్ధంగానే వ్యవహరిస్తుందన్నారు.

మరోవైపు ఇవాళ జరిగిన ఫలప్రదం కాకపోవడంతో నిరాశ చెందిన ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు.. ప్రభుత్వం తో చర్చలు కొనసాగుతాయన్నారు. ప్రభుత్వం జీవోలు ఇచ్చే వరకూ ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. 49 డిమాండ్ లు ప్రభుత్వం ముందు పెట్టామని, 30 శాతం మధ్యంతర భృతి అడిగితే ప్రభుత్వం పీఆర్సీ ఇస్తామని చెబుతోందన్నారు. జీవో ల బట్టి ఉద్యమ కార్యాచరణ పై నిర్ణయం ఉంటుందన్నారు. పీఆర్సీని జూలై నాటికి చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, ప్రభుత్వ చర్యల ఆధారంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. గత సమావేశంలో చెప్పిన వాటినే ప్రభుత్వం మళ్ళీ చెప్పుకొచ్చిందని ఆయన తెలిపారు.
-
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..?












Click it and Unblock the Notifications