ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ పై కీలక అప్డేట్..!
ఏపీలో అర్హులైన విద్యార్దులకు ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) పథకం అమలు చేస్తున్న ప్రభుత్వం.. వాటిలో అనర్హుల ఏరివేత, పథకం పక్కదారి పట్టకుండా ఉండేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పేరుకుపోతున్న నేపథ్యంలో వాటి విడుదలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం.. అంతకు ముందే అర్హుల్ని గుర్తించే పనిలో పడింది. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్ మెంట్ మొత్తాలు ఖాతాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పడాలంటే కొన్ని నిబంధనల్ని తప్పనిసరి చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఫీజు రీయింబర్స్ మెంట్ పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం అప్డేట్ ఇచ్చింది. ఇందులో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబంధించి కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. ఈ రూల్స్ పాటించకపోతే విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు జమ కావని తేల్చిచెప్పేసింది. ఇందులో మొత్తం ఐదు అంశాలు ఉన్నాయి. వీటిలో ఏ ఒక్కటి పాటించకపోయినా ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు జమ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి విద్యార్ధులు వీటిని కచ్చితంగా పాటించాల్సిందే.

ఇందులో మొదటిది 10వ తరగతి మార్కు లిస్ట్, ఆధార్ కార్డులో ఉన్న పేరు ఒకేలా ఉండాలని స్పష్టం చేసింది. రెండవది బయోమెట్రిక్ అథెంటికేషన్ సమయంలో ఆధార్ డేటా, విద్యాశాఖ దగ్గర అందుబాటులో ఉన్న డేటా మ్యాచ్ అయ్యేలా ఉండాలని తెలిపింది. మూడవది విద్యార్ధుల ఆధార్ కు మొబైల్ నంబర్ లింక్ అయి ఉండాలని సూచించింది. నాలుగవది విద్యార్థి బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలని తెలిపింది. ఐదో నిబంధన ప్రభుత్వ గణాంకాల ప్రకారం 20 శాతం విద్యార్థులు తమ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కోరిందెి.














Click it and Unblock the Notifications