AP Police Recruitment: ఏపీలో కానిస్టేబుల్ తుది పరీక్ష తేదీ ఖరారు..!
ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఇప్పటికే అన్ని పరీక్షలు పూర్తయినా తుది వ్రాత పరీక్ష మాత్రం మిగిలి ఉంది. దీంతో ఈ పరీక్ష నిర్వహణ కోసం ప్రభుత్వం తేదీ, సమయం ఖరారు చేసింది. అలాగే రాష్ట్రంలోని ఐదు పరీక్ష కేంద్రాల్ని వీటి కోసం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. వీటి వివరాలు ఓసారి తెలుసుకుందాం..
కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం తుది రాతపరీక్షను జూన్ 1న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకూ పరీక్ష జరగనుంది. ఏపీలోని విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో మొత్తం 38,910 మంది అభ్యర్ధులు పరీక్ష రాయనున్నారు. వీరు తమకు సమీపంలో ఉన్న పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2023 జనవరి 22న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్షలో 4.59 లక్షల మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 95208 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి గతేడాది డిసెంబర్ 30న ఫిజికల్ టెస్టు నిర్వహించారు. ఇందులో 38910 మంది అభ్యర్ధులు క్వాలిఫై అయ్యారు. వీరికి ఇప్పుడు జూన్ 1న తుది వ్రాత పరీక్ష నిర్వహించనున్నారు.
జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే వ్రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో ఒకే పేపర్ గా ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు https://slprb.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి తెలుసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఈ వెబ్ సైట్ లోనే ఫైనల్ గా ఎంపికైన అభ్యర్ధుల వివరాలు కూడా ఇవ్వనున్నట్లు తెలిపింది.
-
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!!











Click it and Unblock the Notifications