ఏపీలో 5 ప్రధాన ఆలయాలకు కొత్త ఛైర్మన్లు..! టీటీడీ స్థానిక కమిటీలకూ..!
ఏపీలో కూటమి సర్కార్ మరోసారి నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేసింది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణల నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలోని ఐదు ప్రధాన ఆలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమించింది. వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుల నియామకాలు కూడా చేసింది. దీంతో దేవాదాయశాఖకు సంబంధించి కీలక పదవుల్ని భర్తీ చేసినట్లయింది.
రాష్ట్రంలోని వివిధ దేవాలయాల బోర్డులకు ఛైర్మన్లను నియమిస్తూ కూటమి ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో
శ్రీశైలంలోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఛైర్మన్ గా పోతుగుంట రమేశ్ నాయుడు, శ్రీకాళహస్తిలోని శ్రీ కాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా కొట్టె సాయి ప్రసాద్, కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం ఛైర్మన్ గా వి.సురేంద్ర బాబు (మణి నాయుడు) ను నియమించారు.

అలాగే కీలకమైన విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఛైర్మన్ గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ)కి అవకాశం కల్పించారు. చివరిగా కోనసీమ జిల్లాలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం ఛైర్మన్ గా ముదునూరి వెంకట్రాజును నియమించారు. దీంతో పాటు టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు ప్రెసిడెంట్లను కూడా నియమించారు. వీటిలో హైదరాబాద్ జూబ్లీహిల్స్ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీకి అధ్యక్షుడిగా ఏ.వి.రెడ్డిని, హిమాయత్ నగర్ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా నేమూరి శంకర్ గౌడ్ ను నియమించారు.

అలాగే బెంగళూరులోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా వీరాంజనేయులను, ఢిల్లీ టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా ఎదుగుండ్ల సుమంత్ రెడ్డిని, ముంబై టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా గౌతమ్ సింగానియాని, విశాఖపట్నంలోని టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీ అధ్యక్షుడిగా చోడే వెంకట పట్టాభిరామ్ ను నియమించారు.
-
అమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ కేంద్రాల ప్రారంభం-దేశంలోనే తొలిసారి..! -
ఏపీ నూతన ఎన్నికల కమిషనర్ గా.. జగన్ బాధిత అధికారి..!? -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్-ఉత్తీర్ణతా శాతాలివే..! సప్లిమెంటరీ షెడ్యూల్..! -
AP Inter Results 2026 Release: ఇంటర్ ఫలితాల విడుదల -ఇలా చెక్ చేసుకోండి..! -
గ్రామాల్లోకి కూడా "అన్నా క్యాంటీన్లు"..! -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు రేపే-లోకేష్ కీలక ప్రకటన..! -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్ను చిత్తు చేసిన SRH!












Click it and Unblock the Notifications