పశువులకు ఆధార్ తరహా గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ సర్కార్ .. ఎందుకంటే
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి సీఎం జగన్ పాలనలో తన మార్క్ చూపిస్తున్నారు. అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏపీ సర్కార్ పశువులను వదిలిపెట్టటం లేదు. అందుకే పశువుల విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పశువులకు ఆధార్ తరహాలో గుర్తింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది .

రాష్ట్రంలోని పశువులకు 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వనున్న ప్రభుత్వం
రాష్ట్రంలోని పశువులు, మేకలు, గొర్రెలకు ప్రభుత్వం 12 అంకెల విశిష్ట సంఖ్యను ఇవ్వబోతోంది. ఆధార్ తరహా గుర్తింపు పశువులకు జారీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వీటిని పశువులకు ఎలా ఇస్తారంటే 12 అంకెల సంఖ్యగలిగిన ఈ నంబర్లను పశువుల చెవులకు ప్రత్యేక ట్యాగ్ వేయనున్నారు. దీంతో భవిష్యత్లో ఈ ట్యాగ్ ఉన్న పశువులకే ప్రభుత్వ పథకాలు అందనున్నాయి. పశు సంవర్ధక శాఖలో పశువుల కోసం అందించే పథకాలు దుర్వినియోగం కాకుండా చూడటం కోసమే ఈ ట్యాగ్ విధానం అమలు చెయ్యాలని భావిస్తుంది సర్కార్ .

పశువుల పథకాలు దుర్వినియోగం కాకుండా ఇనాఫ్ ట్యాగ్
ఇక ఈ ట్యాగ్ లేనివి ప్రమాదంలో చనిపోయినా, రైతుకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వరని తెలుస్తుంది . అంతేకాదు రాయితీ పథకాలు కూడా మంజూరు కావు. ఏటా పశుసంవర్థక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయిస్తున్న రూ.1000 కోట్లలో నాలుగో వంతు నిధులు రాయితీ పథకాలకు ఇస్తోంది. అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1.08 కోట్ల ఆవులు, గేదెలు ఉన్నట్లు గుర్తించారు.
ఇక పశువుల పథకాలు దుర్వినియోగం కాకుండా ఉండేందుకే ఇనాఫ్ ట్యాగ్ అంటే ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్టవిటీ అండ్ హెల్త్ ను వేయనున్నారని సమాచారం .

వచ్చే రెండు నెలలలో ట్యాగ్లు వేయాలని ప్రభుత్వ నిర్ణయం
ఇక ఏపీ సర్కార్ చిత్తూరు జిల్లాను గత ఆగస్టులో ఈ కార్యక్రమానికి పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈనెల 16 నుంచి రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల్లోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణకు వాక్సిన్తోపాటు ఇనాఫ్ ట్యాగ్ను వేయనున్నారు. అయితే రెండు నెలల కాల వ్యవధిలో పశువులకూ వాక్సిన్తోపాటు ట్యాగ్లు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు.. కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూ.31 కోట్లను కేటాయించింది.

మనుషులకే కాదు పశువులకు ఆధార్ తరహా గుర్తింపు
ఇందులో రూ.15 కోట్లు ఇనాఫ్ ట్యాగ్లకు పోగా.. మిగిలిన నిధులను వాక్సిన్ కొనుగోలు, వాటిని భద్రపరచడానికి రిఫ్రిజిరేటర్లు, ఇతర పరికరాల కొనుగోలుకు ఖర్చు చేశారు. మొత్తానికి మనుషులకే కాకుండా పశువులకు సంక్షేమ పథకాలు అందేలా , ఇనాఫ్ ట్యాగ్ లు వేసి నిధులు దుర్వినియోగం కాకుండా చూడటానికి ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం మరి కొద్ది రోజుల్లో అమలులోకి రానుంది.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications