AP Property Tax: ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు డబుల్ బొనాంజా..!
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు ప్రభుత్వం ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఇప్పటికే గత ఆర్దిక సంవత్సరంలో ఆస్తిపన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ నెలాఖరులోపు ప్రస్తుత ఆర్దిక సంవత్సర బకాయిలు చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇస్తామని కూడా ప్రకటించింది. అయితే గతేడాది బకాయిల్ని వడ్డీ రాయితీతో కట్టే గడువు మార్చి 31తోనే ముగియగా.. ఈ సంవత్సరపు పన్ను రాయితీతో చెల్లించే గడువు మాత్రం నెలాఖరుతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను (భవనాలు మరియు ఖాళీ భూములు) బకాయిలపై విధించిన వడ్డీలో 50% మాఫీకి గత నెలతో ముగిసిన గడువును ఈ నెలాఖరు వరకూ పొడిగిస్తూ ప్రభుత్వం ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్ కుమార్ తెలిపారు..

ఈ గడువును అన్ని పట్టణ స్ధానిక సంస్థల్లో ఒకేసారి చెల్లించాలని, ఈ గడువును అసెస్సీ 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు మొత్తం ఆస్తి పన్ను బకాయిలను 30.04.2025న లేదా అంతకు ముందు ఒకేసారి 50% వడ్డీతో కలిపి చెల్లిస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో మరియు 30.04.2025 వరకు పన్ను చెల్లింపుదారులు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు బకాయిలపై చెల్లించిన వడ్డీని భవిష్యత్తులో ఆస్తి పన్ను చెల్లింపులకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024-25 తేదీ నాటికి 30.04.2025 నాటికి నగదు వాపసు చేయబడదని తెలిపారు.
గతంలో ప్రభుత్వం పట్టణ స్ధానిక సంస్థల్లో 2024-2025 సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీని ఒకేసారి మాఫీ చేయడానికి ఆదేశాలు జారీ చేసింది. అలాగే చివరి తేదీ 31-03-2025గా పేర్కొంది. కానీ ఈ ఉత్తర్వులు 25.03.2025న జారీ చేశారు. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగియడానికి ఆరు రోజుల ముందు మాత్రమే. అదే సమయంలో ఉగాది, రంజాన్ పండుగల కారణంగా రెండు ప్రభుత్వ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కువ మంది ఈ రాయితీ వాడుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో వారి నుంచి వచ్చిన అభ్యర్ధనల మేరకు ఈ పొడిగింపు ఇచ్చారు.
-
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
"దేశంలోనే పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన ప్రాంతం ఏపీ" -
గ్యాస్ కు ప్రత్యామ్నాయంగా నేటినుండి కిరోసిన్ పంపిణీ మొదలెట్టిన ఏపీ ప్రభుత్వం! -
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం-ఎల్పీజీ సిలెండర్ల స్ధానంలో ఇక..! -
స్టీల్ ప్లాంట్ కి కాదు స్టీల్ సిటీకి పునాది.. ప్రపంచస్థాయి నగరంగా విశాఖ: చంద్రబాబు! -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
Peddireddy Ramachandra Reddy: సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డికి ఝలక్ - చంద్రబాబుతో వ్యవహారంలో..! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications