ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు జీవో పై ప్రభుత్వం క్లారిటీ..!!
ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు పై ప్రచారంలోకి వచ్చిన నకిలీ జీవో పాత్రధారులపై ప్రభుత్వం చర్యలకు సిద్దం అవుతోంది.
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచారంటూ పెద్ద ఎత్తున న్యూస్ వైరల్ అవుతోంది. ప్రస్తుతం 62 సంవత్సరాలుగా ఉన్న ఉద్యోగుల పదవీ విరమణ వయసు 65 ఏళ్లకు పెంచారంటూ ఒక జీవో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. దీంతో..ఉద్యోగుల్లో దీని పైన సందేహాలు నెలకొన్నాయి. దీంతో..వెంటనే ప్రభుత్వం స్పందించింది. ఉద్యోగ సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఈ జీవో ప్రభుత్వం జారీ చేసిన జీవో కాదని ప్రభుత్వం..ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. ఇది ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వ జీవో పేరుతో నకిలీ జీవోను తయారు చేసారు.
గతంలో ప్రభుత్వం ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన జీవోలోనే మార్పులు చేసి ప్రభుత్వ తాజా జీవోగా ప్రచారంలో పెట్టారు. దీని పైన ఏపీ ప్రభుత్వ ఆర్దిక శాఖ సీరియస్ అయింది. ప్రభుత్వ జీవోలను నకిలీవి ప్రచారంలోకి తీసుకురావటం పైన నేరుగా గుంటూరు రేంజ్ డీఐజీకి ఫిర్యాదు చేసింది.
దీని పై వెంటనే విచారణ ప్రారంభించాలని డీఐజీ గుంటూరు ఎస్పీని ఆదేశించారు. అసలు ఈ జీవో ఎక్కడ నుంచి సర్క్యులేట్ అవ్వటం ప్రారంభమైంది..ఎవరు తయారు చేసారనే కోణంలో విచారణ ప్రారంభం అయింది. ప్రభుత్వం ఈ నిర్ణయం పైన క్లారిటీ ఇవ్వటంతో ఉద్యోగ సంఘాలు తమ సభ్యులకు సందేశాలు పంపాయి.

ప్రభుత్వం పదవీ విరమణ వయసు పెంచుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉద్యోగ సంఘాల నేతలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న జీవోను ఎవరూ నమ్మవద్దని స్పష్టం చేసారు. ఈ ఫేక్ జీవోతో ఉద్యోగుల్లో గందరగోళం ఏర్పడే అవకాశం ఉండటంతో పాటుగా ప్రభుత్వ వ్యవహారాలను ఇలా నకిలీ జీవోలతో తప్పుడు ప్రచారం చేస్తున్న వారి పైన కఠిన చర్యలను ప్రభుత్వం సిద్దం అవుతోంది.
ఈ జీవో వ్యవహారం పైన ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి నిర్ణయం జరగలేదని..ఏ జీవో ఇవ్వలేదని వెల్లడించింది. ఈ నకిలీ జీవో వెనుక రాజకీయ అజెండా ఏమైనా ఉందా..అసలు ఈ జీవో తయారీ వెనుక ఉన్నదెవరనే అంశం పైన పోలీసులు విచారణ ప్రారంభించారు. కఠిన చర్యలకు నిర్ణయించారు.
-
బడి పిల్లలు శోభనం పెళ్లి కొడుకులా? ఏంటిది - గరికపాటి వ్యాఖ్యల వివాదం..!! -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!!












Click it and Unblock the Notifications